మహానాడు – మొదలైన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు.
రాజమండ్రి శివారులోని వేమగిరి వద్ద విశాలమైన మైదానం లో ఎన్టీఆర్ ప్రాంగణాన్ని ముస్తాబు చేసారు. వేమగిరి హైవే రెండు వైపులా మహానాడు వేదికలు నిర్వహించారు. ఒకటి ప్రతినిధుల సభ కాగా, మరోటి ఆదివారం నిర్వహించబోతున్నా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కోసం సిద్ధం చేసారు. అటు రాయలసీమ ఇటు శ్రీకాకుళం జిల్లాలో నుంచి లక్షలాది మంది కార్యకర్తలు, టీడీపీ అగ్రనేతలు, శ్రేణులు. రాజమహేంద్రవరానికి చేరుకున్నారు. దింతో నగరం లోని హోటళ్లు, గెస్ట్ హౌదసి లు కిక్కిరిసిపోయాయి. మరోపక్క ప్రాంగణమంతా ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ కటౌట్ లతో నిండి పోయి కళలాడుతున్నాయి. రాజమహేంద్రవరం మొత్తం పసుపుమయం గా మారింది. పసుపు ఫ్లెక్సిలు తోరణాలతో సర్వాంగ సుందరంగా శోభిల్లుతున్న మహా నాడు ప్రాంగణం.
ఇవ్వాళా రేపు రెండు రోజుల పటు అట్టహాసంగా మహా నాడు సమావేశాలను టీడీపీ నిర్వహిస్తుంది. మధ్యాహ్నం మహానాడు వేదికకు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అటుపైన ప్రతినిధుల సభ రిజిస్టర్ లో తొలి సంతకం చేసారు. చంద్ర బాబు మహా నాడు వేదికగా ఎన్నికల శంఖారావం పూరించారు. వచ్చే ఎన్నికలే లక్షంగా పార్టీ శ్రేనులకు చంద్రబాబు దిశానిర్ధేశం మరియు ఎన్నికల సమరానికి సిద్ధమయ్యేలా కార్యాచరణ చేస్తున్నారు.
మహానాడు – మొదలైన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు.
రాజమండ్రి శివారులోని వేమగిరి వద్ద విశాలమైన మైదానం లో ఎన్టీఆర్ ప్రాంగణాన్ని ముస్తాబు చేసారు. వేమగిరి హైవే రెండు వైపులా మహానాడు వేదికలు నిర్వహించారు. ఒకటి ప్రతినిధుల సభ కాగా, మరోటి ఆదివారం నిర్వహించబోతున్నా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కోసం సిద్ధం చేసారు. అటు రాయలసీమ ఇటు శ్రీకాకుళం జిల్లాలో నుంచి లక్షలాది మంది కార్యకర్తలు, టీడీపీ అగ్రనేతలు, శ్రేణులు. రాజమహేంద్రవరానికి చేరుకున్నారు. దింతో నగరం లోని హోటళ్లు, గెస్ట్ హౌదసి లు కిక్కిరిసిపోయాయి. మరోపక్క ప్రాంగణమంతా ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ కటౌట్ లతో నిండి పోయి కళలాడుతున్నాయి. రాజమహేంద్రవరం మొత్తం పసుపుమయం గా మారింది. పసుపు ఫ్లెక్సిలు తోరణాలతో సర్వాంగ సుందరంగా శోభిల్లుతున్న మహా నాడు ప్రాంగణం.
ఇవ్వాళా రేపు రెండు రోజుల పటు అట్టహాసంగా మహా నాడు సమావేశాలను టీడీపీ నిర్వహిస్తుంది. మధ్యాహ్నం మహానాడు వేదికకు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అటుపైన ప్రతినిధుల సభ రిజిస్టర్ లో తొలి సంతకం చేసారు. చంద్ర బాబు మహా నాడు వేదికగా ఎన్నికల శంఖారావం పూరించారు. వచ్చే ఎన్నికలే లక్షంగా పార్టీ శ్రేనులకు చంద్రబాబు దిశానిర్ధేశం మరియు ఎన్నికల సమరానికి సిద్ధమయ్యేలా కార్యాచరణ చేస్తున్నారు.