ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ స్టార్ దర్శకుడు శంకర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ తండ్రికొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. దిల్ రాజు ఏకంగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. శంకర్ ఓ వైపు ఇండియన్ 2 మూవీ షూటింగ్ కంప్లీట్ చేస్తూ మరో వైపు రామ్ చరణ్ సినిమా షూటింగ్ కూడా చేస్తున్నాడు. ఇక ఈ మూవీలో కైరా అద్వానీ, అంజలి రామ్ చరణ్ కి జోడీగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా ఏంటి అనేది సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా క్యాన్సిల్ అయిపోవడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఎవరితో రామ్ చరణ్ చేయడానికి రెడీ అవుతున్నాడు అనే విషయంపై క్లారిటీ లేదు. కన్నడ దర్శకుడు నార్తన్ తో పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ ఉంది. అయితే అది అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు మరో కొత్త దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. బింబిసారా సినిమాతో మొదటి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఉండబోతుందని టాక్.
రీసెంట్ గా ఈ దర్శకుడు చెర్రీని కలిసి ఒక పీరియాడిక్ స్టోరీని నేరేట్ చేసాడని టాక్. ఈ కథ చరణ్ కి నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. అయితే ఈ సినిమాని ఎవరు నిర్మించబోతున్నారు అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. మరి వశిష్ఠ మల్లిడి, రామ్ చరణ్ కలయిక ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసేంత వరకు ఎదురుచూడాల్సిందే.