Sai Pallavi అంతకు ముందు సినిమాలు వచ్చినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ‘ఫిదా’తోనే బాగా దగ్గరైంది సాయి పల్లవి. అమ్మడు అవడానికి తమిళియన్ అయినప్పటికీ తెలుగు ఆడియన్స్ తమ ఇంటి బిడ్డగానే అక్కున చేర్చుకున్నారు. దీంతో అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ముద్దుగా లేడీ పవర్ స్టార్ అని పిలుస్తూ ముద్దుగుమ్మకు మరింత హైప్ ఇస్తున్నారు. ఇటీవల విరాట పర్వంతో సాయి పల్లవి ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందివ్వకున్నా కూడా సాయి పల్లవికి మాత్రం ఎలాంటి పాత్రనైనా సునాయసంగా చేయగలుగుతుందనే టాక్ను తెచ్చిపెట్టింది. ఇక ఈ నెల 15న మళ్లీ ‘గార్గి’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సాయి పల్లవి సిద్ధమైంది.
రియల్ లైఫ్లో ఎవరికైనా లవ్ లెటర్ రాశావా?
ప్రస్తుతం ‘గార్గి’ సినిమా ప్రమోషన్స్లో సాయి పల్లవి బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్లో భాగంగా అమ్మడు చెప్పిన ఓ విషయం యూత్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ తమిళ్ బ్యూటీ ఏడవ తరగతిలోనే ఓ అబ్బాయికి లవ్ లెటర్ రాసిన విషయం, అది తెలిసి తల్లిదండ్రులు చితక్కొట్టడం వంటి విషయాలను తాజాగా సాయి పల్లవి పంచుకుంది. ప్రముఖ డిజిటల్ ఛానెల్ నెట్ఫ్లిక్స్ ఓ విలేజ్ షో అనే టాక్ షోను ప్రారంభించింది. ఈ టాక్ షోలో సాయి పల్లవి, రానా దగ్గుబాటితో కలిసి పాల్గొంది. ఆ టాక్ షోను గంగవ్వ నిర్వహిస్తోంది. విరాట పర్వంలో రవన్న పాత్రకు నువ్వు లవ్ లెటర్ రాశావు కదా, రియల్ లైఫ్లో ఎవరికైనా లవ్ లెటర్ రాశావా అని గంగవ్వ (Gangavva) సాయి పల్లవిని అడిగింది.
గంగవ్వ ప్రశ్నకు సాయి పల్లవి చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్గా మారింది. ‘‘నేను ఏడవ తరగతిలో ఉన్నప్పుడు ఓ అబ్బాయికి లవ్ లెటర్ రాశాను. ఆ లెటర్ను నా పేరెంట్స్ చూశారు. నన్ను బాగా కొట్టారు’’ అని చెప్పింది. ఈ సినిమా తమిళ్ వెర్షన్ను జ్యోతిక, సూర్య సొంత ప్రొడక్షన్ హౌస్ 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, వీడియోస్, ట్రైలర్ గార్గి పై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. ‘గార్గి’ సినిమాలో తండ్రి కోసం ఆరాటపడే కూతురు పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది. ఈ చిత్రాన్ని తెలుగులో రానా దగ్గుబాటి విడుదల చేస్తున్నారు.