ఓ వైపు సౌత్ నుంచి స్టార్ హీరోలు పాన్ ఇండియా కథలతో దూసుకుపోతూ ఇండియన్ వైడ్ గా ప్రేక్షకులని అలరిస్తూ ఉన్నారు. వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తూ అదే స్థాయిలో కలెక్షన్స్ సునామి సృష్టిస్తున్నారు. ఇక సినిమాలతో కూడా ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటున్నారు. పాన్ ఇండియా కథల విషయానికి వచ్చేసరికి ఆడియన్స్ హీరోయిక్, హై స్టాండర్డ్స్ వేల్యూతో పాటు అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సూపర్ మ్యూజిక్ తో సౌత్ నుంచి సినిమాలు ప్రేక్షకులని ఆకర్షిస్తున్నాయి. మన సినిమాలలో కథ, కథనంతో పాటు, సంగీతం, నటుల పెర్ఫార్మెన్స్, విజువల్ గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకోవడంతో పాటు భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి. ప్రభాస్, యష్, రామ్ చరణ్, అల్లు అర్జున్, తారక్ లాంటి స్టార్స్ సినిమాలకి ఇండియన్ వైడ్ గా ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు.
సౌత్ దర్శకులు కూడా తమ కథలు, టేకింగ్ తో ప్రేక్షకులని మెప్పిస్తున్నారు. అయితే మొదటి నుంచి బాలీవుడ్ మీడియా, అక్కడి సెలబ్రెటీలకి సౌత్ సినిమాలు అంటే చిన్న చూపు ఉంది. ఇండియన్ సినిమాపై తమ ఆధిపత్యమే ఉండాలని వారు కోరుకుంటారు. సౌత్ హీరోలని అదే పనిగా అవమానిస్తూ ఉంటారు. అలాగే సౌత్ లో వచ్చే కమర్షియల్ కథల మీద కూడా రకరకాలుగా జోకులు వేస్తూ శునకానందం పొందుతారు. అలాంటి సౌత్ సినిమాలు ఇప్పుడు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఆధిపత్యం చూపించడంతో ఓ విధంగా వారు తట్టుకోలేకపోతున్నారు. ఎలా అయిన సౌత్ సినిమాలని డామినేట్ చేయాలని వాళ్ళు కూడా భారీ బడ్జెట్ తో, పీరియాడిక్ పాన్ ఇండియా కథలతో సినిమాలు చేస్తున్నారు. అయితే వారి సినిమాలలో కథ, కథనాలతో పాటు విజువల్ గ్రాఫిక్స్ విషయంలో సరైన శ్రద్ధ చూపించకపోవడం వలన డిజాస్టర్ గా మారుతున్నాయి.
ఇప్పటికే పృథ్విరాజ్ సినిమా థియేటర్ లో దారుణమైన రిజల్ట్ సొంతం చేసుకుంది సౌత్ పాన్ ఇండియా సినిమాల దరిదాపుల్లోకి కూడా ఇది రాలేదు. ఇక తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్, సీనియర్ హీరో సంజయ్ దత్ కాంబినేషన్ లో పీరియాడిక్ కథాంశంతో శంషేరా అనే సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చి మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు 10.25 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక రెండో రోజు అయితే చాలా థియేటర్స్ లో ప్రేక్షకులు లేకపోవడంతో షోలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. బాలీవుడ్ హిస్టరీలో అత్యంత చెత్త సినిమాగా ఈ మూవీ అరుదైనరికార్డు ని క్రియేట్ చేయడానికి రెడీ అవుతుంది. హీరోల పేస్ లు చూపించి ఈ సినిమాని నిర్మాతలు అయితే భారీ ధరలకే అమ్ముకున్నారు. అయితే బయ్యర్లకి మాత్రం థియేటర్స్ రెంట్ ఖర్చులు కూడా వచ్చేలా లేవనే టాక్ వినిపిస్తుంది.