Khushi Kapoor : లెజెండరీ నటి శ్రీదేవి, సినీ నిర్మాత బోనీ కపూర్ కూతుళ్ల గురించి తెలిసిన వాళ్లు.. అయ్య బాబోయ్.. ఏంటిలా తయారయ్యారు? అంటున్నారు. నిజమే వీరి గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ప్రస్తుతం శ్రీదేవి కుమార్తెలు జాన్వీ కపూర్ హీరోయిన్గా రాణిస్తుండగా… ఖుషీ కపూర్ వెండితెరపై మెరిసేందుకు సిద్ధమవుతోంది. అయితే ముఖ్యంగా ఖుషీ కపూర్ సినిమాల్లోకి రాకముందే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ మంచి క్రేజ్ను సంపాదించుకుంది. త్వరలో నెట్ఫ్లిక్స్ కోసం ప్రముఖ డైరెక్టర్ జోయా అక్తర్ దర్శకత్వంలో వహిస్తున్న ‘ది ఆర్చీస్’తో బాలీవుడ్కి అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది.
ఇక అమ్మడికి సంబంధించి ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ముద్దుగుమ్మ తాజాగా కొన్ని పిక్స్ని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసింది. ఆ పిక్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. ఆ పోస్ట్ చూసి.. అక్క మాజీ ప్రియుడితో చెల్లెలు ప్రేమాయణం సాగిస్తోందహో అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇక అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్స్లో.. ఖుషీ బాత్రూమ్లో దిగిన పిక్, ఓ కన్సర్ట్కి సంబంధించిన వీడియోని, అలాగే ఓ వ్యక్తితో చాలా క్లోజ్గా ఉన్న పిక్ ఉన్నాయి. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు అక్షత్ రాజన్. ఖుషీ ఈ పిక్స్ని పోస్ట్ చేసిన కొద్దిసేపటికీ అక్షత్ ‘ly’ అని కామెంట్ పెట్టాడు. అంటే ‘లవ్ యూ’ అని షార్ట్గా రాశాడన్నమాట.
Khushi Kapoor : డేటింగ్ తర్వాత విడిపోయిన జాన్వీ అక్షత్
ఆ కామెంట్కి ఖుషీ స్పందిస్తూ.. ‘ilu’ అని రిప్లై ఇచ్చింది. అంటే ‘ఐ లవ్ యూ’ అని ఖుషీ రిప్లై ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు ఖుషీ, అక్షత్లు లవ్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక్కడ వరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడో ట్విస్ట్ కూడా ఉంది. ఇదే అక్షత్ రంజన్తో ఖుషీ అక్క జాన్వీ కపూర్ గతంలో డేటింగ్ చేసినట్లు రూమర్స్ ఉన్నాయి. 2016లో శ్రీదేవి నటించిన చిత్రం ‘ఇంగ్లిష్ వింగ్లిష్’. ఈ ప్రిమియర్ షోలో జాన్వి, అక్షత్లను చూసిన దగ్గర నుంచి వీరిద్దరూ లవ్లో ఉన్నారంటూ రూమర్స్ వచ్చాయి. ఆ తరువాత వీరిద్దరూ విడిపోయారంటూ కూడా వార్తలొచ్చాయి. అనంతరం కొన్నాళ్ల డేటింగ్ తర్వాత వారిద్దరు విడిపోయారని అప్పట్లో వార్తలు హల్చల్ చేశాయి. ఇప్పుడు తాజాగా ఖుషీ, అక్షత్లు లవ్లో ఉన్నారంటూ రూమర్స్ మొదలయ్యాయి. దీనిపై అక్క మాజీ ప్రియుడితో చెల్లెలు డేటింగ్ చేస్తోందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.