తెలంగాణలో టీఆర్ఎప్-బీజేపీ లొల్లిపై జనం కామెంట్ ఇది. కారు, కమలం పార్టీలు నిజంగానే తిట్టుకుంటున్నాయా..? లేక తిట్టుకుంటున్నట్లు నటిస్తున్నారయని జుట్లు పీక్కుంటున్నారు జనం. హూజూరాబాద్ ఎన్నికల తర్వాత బీజేపీని టార్గెట్ చేసి సీఎం కేసీఆర్, అక్కడ గెలిచిన ఈటెల రాజేందర్ ను ఒక్క మాటా అనకుండా… ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెంటపడ్డారు. రోజు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోస్తున్నారు. అటునుంచి కూడా అదే స్థాయిలో రివర్స్ ఎటాక్ జరుగుతోంది. బండి సంజయ్ కూడా సీఎం కేసీఆర్ మీద విమర్శలు ఎక్కుపెట్టి ఎదురు దాడి చేస్తున్నారు. ఇదంతా పొలిటికల్ స్టంట్ అంటోంది కాంగ్రెస్ పార్టీ. మధ్యలో నలిగిపోతూ, ఏం జరుగుతుందో అర్థం కాక, జనాలకు ఎలా చెప్పాలో తెలియక మల్లగుల్లాలు పడుతోంది.. కేసీఆర్ ,బండి సంజయ్ కూడబలుక్కొని ఆరోపణలు చేస్తున్నాని కూడా తెలంగాణ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. జనం కూడ డైలామాలో ఉన్నారు. అసలేం జరుగుతుందో తెలియక, తికమకపడుతున్నారు.. కేసీఆర్ మోడీ రహస్య ఒప్పందంలో భాగంగానే ఆరోపణ,ప్రత్యారోపణలు జరగుతున్నాయని కూడా చర్చలు సాగుతున్నాయి. ఇది రణం కాదని, రహస్య ఒప్పందమనీ అనే వాళ్లూ ఉన్నారు…