గాయని శ్రావణ భార్గవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నేపధ్య గాయనిగా ఆమె ఇప్పటికే టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమగ్గే ని సొంతం చేసుకుంది. ఇక శ్రావణ భార్గవి భర్త హేమచంద్ర కూడా సింగర్ అనే సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్య కాలంలో సెలబ్రెటీలు అందరూ సొంతగా యు ట్యూబ్ చానల్స్ రన్ చేసుకొని దాని ద్వారా తమ పాపులారిటీ ఉపయోగించుకొని బాగానే సంపాదిస్తున్నారు. ఇక తమ యు ట్యూబ్ ఛానల్స్ కోసం ప్రత్యేకంగా కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా శ్రావణ భార్గవి కూడా తన యు ట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో పెట్టింది. ఆ వీడియోలో ఆమె కాస్తా శృంగాభరితంగా నటిస్తూ కనిపించింది.
అంత వరకు బాగానే ఉన్నా ఆ వీడియో కోసం ఉపయోగించిన పాట వివాదానికి కారణం అయ్యింది. అన్నమాచార్య కీర్తనలలో ఒకటైన ఒకపరి ఒకపరి వయ్యారమా అనే కీర్తనని ఆమె తన వీడియో కోసం ఉపయోగించింది. నిజానికి అన్నమాచార్య తన కీర్తనలు అన్ని కూడా కేవలం వెంకటేశ్వర స్వామిని ద్రుష్టిలో ఉంచుకొని రచించారు. ఇప్పటికి అన్నమయ్య కీర్తనలని భక్తి గీతాలుగానే అందరూ చూస్తున్నారు. అలాంటి పాటని శృంగారభరిత గీతంగా చూపించడంపై అన్నమాచార్య వంశీకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే అన్నమాచార్య గీతాలని గౌరవించే చాలా మంది శ్రావణ భార్గవి చేసిన ఆ వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఛానల్స్ ద్వారా ఆమెపై విమర్శలు చేశారు.
అన్నమాచార్య వంశీకులు అయితే టీటీడీకి ఫిర్యాదు కూడా చేశారు. ఇక ఆ వీడియోని తొలగించి శ్రావణ భార్గవి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చాలా మంది ఆమెకి ఫోన్స్ కూడా చేసి వీడియో తొలగించాలని హెచ్చరించారు. ఇలా ఆ వీడియో వివాదంగా మారి మరింత పెద్దది కావడంతో శ్రావణ భార్గవి కూడా వెనక్కి తగ్గింది. ముందుగా తొలగించనని చెప్పిన కూడా తాజాగా ఆ వీడియోని తొలగించి త్వరలో మరో కొత్త వీడియోతో వస్తానని చెప్పింది. వివాదాలలో దూరడం తనకి ఇష్టం ఉండదని, దీనికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నట్లు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అలాగే తన ఛానల్ నుంచి వీడియోని కూడా తొలగించింది.