ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పాన్ ఇండియా మూవీ RRR. టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన సినిమా కావడంతో పాటు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్.. హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి ఈ చిత్రంలో నటించారు. బాహుబలితో తెలుగు సినిమా రేంజ్ పెంచిన దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 7న రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ కరోనా థర్డ్ వేవ్ కారణంగా మార్చి 25 కు వాయిదా వేశారు.
RRR రిలీజ్ డేట్ మార్చి 25న కానున్నడంతో ఎంటైర్ యూనిట్ సినిమా ప్రమోషన్స్పై ఫుల్ పోకస్ పెట్టింది. రాజమౌళి ట్రెండ్ కు విభిన్నంగా RRR ప్రమోషన్స్ను స్టార్ట్ చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గ్యాప్లో మన హీరోలు ఏం చేశారనే దానిపై యూనిట్ ఓ ఫొటోను షేర్ చేసింది. ఇంతకీ ఆ ఫొటోలో హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఏం చేస్తున్నారో అంటే? వారి వారి మొబైల్ ఫోన్స్లో మెసేజ్లను చెక్ చేసుకుంటున్నారు మనోళ్లు. కెమెరాలు రోల్ కానీ సమయంలో వారి ఫోన్స్ను స్క్రోల్ చేస్తున్నారంటూ సదరు ఫొటోను ఉద్దేశించి రాజమౌళి కామెంట్ చేసారు.
RRRలో మన్యం వీరుడు అల్లూరి సీతా రామరాజుగా చెర్రీ, కొమురం భీమ్గా తారక్ నటించారు. 1920లో బ్యాక్డ్రాప్లో సాగేదే చిత్ర కథనం. చరిత్రలో కలుసుకోని ఇద్దరు యోధులు కలుసుకుని స్వాతంత్య్రం కోసం పోరాడితే ఎలా ఉంటుందనే ఆలోచనలో తెరకెక్కిన ఫిక్షనల్ పీరియాడిక్ సినిమా RRR. దాదాపు నాలుగు వందల కోట్లను మించిన భారీ బడ్జెట్తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.