SSMB 28: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు కి జోడిగా పూజా హెగ్డే శ్రీలీల నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 40% పైగా పూర్తయినట్లు తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రైతుల తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ పోషించబోతున్నట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్ స్టైల్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు, సూపర్ స్టార్ మహేష్ నుంచి ఫ్యాన్స్ కోరుకుని యాక్షన్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఈ మూవీలో ఉంటాయని సమాచారం.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన టాక్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ఒక చెల్లెలు పాత్రను కూడా క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం టాలీవుడ్ లో ఒక యంగ్ హీరోయిన్ రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని టాక్. మహేష్ బాబు చెల్లెలు పాత్రకి ఎమోషనల్ బాండింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని ఫిలింనగర్ సర్కిల్లో వినిపిస్తుంది.
అయితే ఆ పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేశారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. ఇదిలా ఉంటే ఈ నెల 22న ఈ సినిమాకి సంబంధించి కీలక అప్డేట్ ని ఎనౌన్స్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ట్విట్టర్ లో ఖరారు చేసింది. మూవీ టైటిల్ ని రివీల్ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. ఇక అదే రోజు ఈ సినిమాలో చెల్లెలుగా నటించబోయే హీరోయిన్ పాత్రని కూడా రివీల్ చేయనున్నట్లు టాక్. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది చూడాలి.