ఏపీ రాజకీయాలలో వైసీపీని అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా జనసేనని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ టీడీపీ పార్టీతో పొత్తు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చాలాకాలంగా ఏపీ రాజకీయాల్లో జనసేన టిడిపి పొత్తుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే యువ శక్తి సభ వేదికగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి తన డిమాండ్ ఏంటి అనేది చెప్పకనే చెప్పేశారు. 57 స్థానాల వరకు తమకి బలం ఉందని చెప్పడం ద్వారా తాము అన్ని స్థానాలను కోరుకుంటున్నట్టు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి క్లారిటీ ఇచ్చారు.
అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ స్థాయిలో స్థానాలను జనసేన పార్టీకి ఇచ్చేందుకు సుముఖంగా లేదని మాట గట్టిగా వినిపిస్తుంది. 25 స్థానాల వరకు మాత్రమే జనసేన ఇవ్వడానికి టిడిపి సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే వైసిపిపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ఏపీ ప్రజలు కూడా టిడిపి జనసేన పొత్తుని స్వాగతిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.
ఇదిలా ఉంటే ఇప్పుడు జనసేన టిడిపి పార్టీల పొత్తు ద్వారా ఏపీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారబోతున్నాయని మాట వినిపిస్తుంది. ప్రజలు కూడా ఈ కూటమికి పట్టం కట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. తాజాగా దీనికి సంబంధించిన సర్వే ఒకటి బయటకు వచ్చింది. తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుని 2024 ఎన్నికల్లో పోటీ చేస్తే కచ్చితంగా 120 నుంచి 135 సీట్లు వరకు వస్తాయని అంచనా వేసింది.
అయితే బిజెపి వీరితో కలిసిన కలవకపోయినా గెలిచే స్థానాల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చుని ఆ సర్వేలో పేర్కొన్నారు. అయితే ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోకుంటే మాత్రం కచ్చితంగా వైసీపీ 100 నుంచి 120 సీట్లు గెల్చుకొని అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఆ సర్వేలో పేర్కొన్నారు. మరి టిడిపి జనసేన పార్టీలు సీట్ల పంపకాలలో ఒక అంగీకారానికి వచ్చి పొత్తుతో ఎన్నికలలో పోటీ చేస్తారా లేదా ఒంటరిగా ఎవరికి వారు వెళ్తారా అనేది వేచి చూడాలి.