వజ్రం ఎప్పటికి నిలిచే ఉంటుంది అనే మాట తరుచుగా వింటూ ఉంటాం. వజ్రానికి ఉన్న విలువని ఈ మాట చెబుతుంది. అయితే అది ఎప్పుడు ఎలా ఎక్కడ దొరుకుతుంది అనేది ఎవరూ చెప్పలేరు. ఏపీలో అనంతపురం, కర్నూల్ జిల్లాలలో ఇప్పటికి కూడా వర్షాకాలంలో వజ్రాల కోసం అక్కడి ప్రజలు వెతుకుతూ ఉంటారు. కొంతమందికి అదృష్టం కలిసి వచ్చి వజ్రాలు దొరుకుతాయి. అలా దొరికిన వజ్రాలకి లక్షల విలువ మార్కెట్ లో ఉంటుంది. అందుకే వర్షాకాలంలో పత్తికొండ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలలో వజ్రాల కోసం అన్వేషిస్తూ ఉంటారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు అలాంటి ఓ వజ్రం కథ చెప్పుకోవాలి. 1980లో కాంగో దేశంలో ఓ ఇంట్లో గుంత కోసం వజ్రాల గని నుంచి మట్టిని తీసుకొచ్చి పోశారు. కాలక్రమంలో అదో చెత్త గుంతగా మారింది. అయితే ఓ బాలుడు ఆడుకుంటున్న సమయంలో ఆ గుంతలో మెరుస్తున్న రాయి దొరికింది. దానిని తీసుకెళ్లి ఆ ఇంటి యజమానికి ఇచ్చాడు. అది వజ్రం అని గ్రహించిన అతను ఓ వ్యాపారికి అమ్మడు. అప్పటికి దాని బరువు 890 క్యారెట్స్. అయితే దానిని సానబెడుతూ, సరికొట్తగా తీసుకొచ్చే క్రమంలో క్రమంగా 303 క్యారెట్స్ కి అది తిరిగిపోయింది.
ఆ వజ్రాన్ని ప్రస్తుతం దుబాయ్ లో ఓ వేలం ప్రదర్శనశాలలో సందర్శన కోసం ఉంచారు. ఇప్పుడు దాని విలువ అక్షరాలా 123 కోట్లు. అంత విలువైన ఆ వజ్రం పేరు గోల్డ్ కనరీ. దీనిని న్యూయార్క్, సౌత్ బిలో త్వరలో వేలం వేయబోతున్నారు. మరి ఈ వజ్రాన్ని సొంతం చేసుకునే వ్యక్తి ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 123 కోట్ల ప్రారంభ ధరగా వేలం నిర్వహించడానికి సిద్ధం అవుతున్నారు. ఏది ఏమైనా ఒక చెత్తకుప్పలో చిన్న పిల్లాడికి దొరికిన వజ్రం ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆకర్షిస్తుంది.