పసిడి ధర దూసుకుపోయింది. నిన్న తగ్గిన పసిడి రేటు ఈరోజు మాత్రం మళ్లీ పెరిగింది. పసిడి ధర మరోసారి పరుగులు పెట్టింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారి కి బాడ్ న్యూస్ అనిచెప్పాలి. బంగారం ధర జిగేల్ మంటే వెండి రేటు మాత్రం స్థిరంగా ఉంది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో పసిడి వెండి ధరలు భారీగా పెరిగాయి.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో శనివారం బంగారం ధరలు దూసుకుపోయాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 మేర పెరిగింది. దీంతో ఇప్పుడు బంగారం రేటు రూ. 52,040కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.౪౦౦ వరకు పెరిగింది. దీంతో బంగారం రేటు రూ. 47,700కు చేరింది. పసిడి ధరలు పెరిగితే.. వెండి రేటు మాత్రం నిలకడగా ఉంది. రూ. 72,500 వద్దనే స్థిరంగా కొనసాగుతుంది.