బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వారికి తీపికబురు. బంగారం రేటు తగ్గింది. బంగారం ధర కిందకి వచ్చింది. పసిడి ధర వెలవెలబోయింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది కాస్త ఊరట కలిగించే అంశమని చెప్పాలి. బంగారం ధర తగ్గితే.. వెండి రేటు మాత్రం నిలకడగానే ఉంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో మంగళవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.130 క్షీణించింది. దీంతో పసిడి రేటు రూ. 50,050కు తగ్గింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.90 తగ్గింది. దీంతో పసిడి రేటు రూ. 45,900కు క్షీణించింది. బంగారం ధరలు తగ్గితే.. వెండి రేటు మాత్రం నిలకడగానే కొనసాగింది. వెండి రేటులో ఎలాంటి మార్పు లేదు. దీంతో కేజీ వెండి ధర రూ.70,000 వద్దనే ఉంది.