సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన అతడు సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. అయితే తర్వాత ప్రసారం తర్వాత ఊహించని స్థాయిలో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికి ఈ మూవీ టీవీలలో ప్రసారం అయితే చూడటానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మురళీ మోహన్ ఈ సినిమాని నిర్మించారు. చాలా సందర్భాలలో ఈ సినిమా గురించి మురళీమోహన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అతడు సినిమా థియేటర్ లో వచ్చిన కలెక్షన్ కంటే టీవీ హక్కుల ద్వారానే ఎక్కువ ఆదాయం వచ్చిందని గతంలో చెప్పారు.
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కూడా అతడు సినిమా కెరియర్ బెస్ట్ మూవీలలో ఒకటిగా నిలబడింది. ఇప్పటికి ఈ సినిమాని చూస్తే ఒక ఫ్రెష్ కంటెంట్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. త్రిష కెరియర్ లో కూడా ఈ మూవీ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. దీని తర్వాత త్రిష స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో దూసుకుపోయింది. ఇంత మంది కెరియర్ కి ప్లస్ అయినా ఈ సినిమాకి ఇప్పటికి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి తాజాగా మరో ఆసక్తికరమైన మురళీమోహన్ రివీల్ చేశారు. అతడు సినిమా కోసం ముందుగా ఉదయ్ కిరణ్ ని హీరోగా అనుకున్నామని, అతనికి స్టోరీ కూడా చెప్పడం జరిగిందని చెప్పారు. అతను ఇప్పటికే వరుస సక్సెస్ ల మీద ఉండటంతో చాలా సినిమాలు కమిట్ అయ్యి ఉన్నాడు. దీంతో అతడు సినిమా కోసం మరో ఏడాది వెయిట్ చేయాలని, తరువాత చేస్తానని చెప్పాడు.
దీంతో నెక్స్ట్ మహేష్ బాబుకి కథ చెప్పడం, అతను ఒప్పుకోవడంతో సెట్స్ పైకి వెళ్ళింది అని మురళీమోహన్ చెప్పుకొచ్చారు. అలా మహేష్ కెరియర్ లో బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ఇదే సినిమా ఉదయ్ కిరణ్ కి పడి ఉంటే కచ్చితంగా స్టార్ హీరోగా మారిపోయేవాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఇక వరుస సక్సెస్ లు అందుకున్న ఉదయ్ కిరణ్ కెరియర్ తరువాత గాడితప్పడం, చివరికి కెరియర్ పూర్తిగా దెబ్బ తినడం జరిగింది. తరువాత అతని జీవితం విషాదంగా ముగిసింది.