ఐక్యమత్యం ఉంటే ఏదయినా సాధించొచ్చు అనే విషయం చిన్నప్పటి నుంచి మన పుస్తకాలలో చదువుకుంటున్నాం. అలాగే నిజజీవితంలో కూడా చాలా సంఘటనలు చూస్తూ ఉన్నాం. అయితే అలాంటి ఐక్యమత్యం అనేది మనుషులలో రోజురోజుకి తగ్గిపోతుంది. ఎవరికి వారు అనుకుంటూ స్వప్రయోజనాల కోసం పనులు చేసేవారు ఎక్కువ అయిపోయారు. అయితే జంతువులు మన అంత అప్డేట్ కాలేదు కాబట్టి వాటి సహజ లక్షణాలని, జాతి బంధాన్ని ఇప్పటికి కొనసాగిస్తున్నాయి. జంతువులలో జాతి వైరం ఒకేరకమైన జీవులలో ఎప్పటికి ఉండదు. ఆకలి తీర్చుకోవడం నుంచి ఇతర జంతువులని వేటాడటం, తమని తాము రక్షించుకోవడం వరకు జంతువులు ఐక్యమత్యం ప్రదర్శిస్తూ ఉంటాయి. వాటిని చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి.
— kocheng (@twitkocheng) August 12, 2022
ఇప్పుడు అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రెండు పిల్లులు ఆహారం కోసం ఒకదానితో ఒకటి పోట్లాడుకోకుండా ఎంచక్కా ఒకదాని తర్వాత ఒకటి తింటూ ఉన్నాయి. ముందు ఒక పిల్లి గిన్నెలో ఉన్న ఆహారాన్ని తిని మరో పిల్లికి దానిని ఇచ్చింది, తరువాత అది కూడా కొద్దిగా ఆహారాన్ని తిని మరల ముందు పిల్లికి దానిని అందించింది. అలా ఒకే గిన్నెలో ఉన్న ఆహారాన్ని రెండు పిల్లులు కలిసి తిన్నాయి. వాటి మధ్య ఐక్యమత్యం చాటే విధంగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏకంగా 33 లక్షల మంది ఈ వీడియోని చూడటంతో పాటి డిఫరెంట్ గా కామెంట్స్ పెడుతున్నారు. ఐక్యంగా ఉండే ఏదైనా సమానంగా పొందొచ్చు అనేది ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది అని కొందరు అంటే, వాటిని చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి అంటూ మరికొందరు కాయిన్స్ పెడుతున్నారు.