ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న థియేటర్లలో విడుదల కానుంది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఈ రొమాంటిక్ మూవీకి సంబంధించిన ముఖ్యమైన అప్ డేట్ ను అందించడానికి రాధే శ్యామ్ టీమ్ రెడీ అవుతోంది.
రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం నుండి కొన్ని మనోహరమైన కొత్త పోస్టర్ లను విడుదల చేయడమే గాక.. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సినిమా నుండి ప్రత్యేకమైన ఆశ్చర్యం కలిగించే విజువల్స్ ని షేర్ చేస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రేమికుల రోజు కానుకగా అందిస్తున్నామని తెలిపారు.
కొత్త పోస్టర్లను షేర్ చేస్తూ కొన్ని వివరాల్ని అందించారు. ప్రేమ గాలిలో ఉంది.. దానిని ఆపేది లేదు! ప్రేమికుల దినోత్సవం కోసం అభిమానులు సిద్ధంగా ఉండండి. ఈ మధ్యాహ్నం 1:43 గంటలకు ప్రత్యేకంగా ఆశ్చర్యం కలిగించే ట్రీట్ ఇస్తున్నాం
అని మూవీ టీమ్ వెల్లడించింది.
రాధేశ్యామ్ విడుదలకు ఇంకా కేవలం 25రోజులు మాత్రమే ఉన్నాయి. అంతకుముందు అన్ని ఏర్పాట్లతో టీమ్ రెడీ అవుతుంది. సినిమా మొత్తం పూర్తయిన తర్వాత రిలీజ్ వెర్షన్ కాపీ చూసి అందులో మార్పులు చేర్పులు కోరే హీరోలు టాలీవుడ్ లో కొందరు ఉన్నారన్న సంగతి తెలిసిందే.
పెద్ద హీరోలు తుది కాపీ ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేస్తుంటారు. ఎడిటింగ్ వెర్షన్ లో మార్పులు ఏమైనా చేయాల్సి వస్తే దర్శకుడికి సూచిస్తారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా రాధేశ్యామ్
విషయంలో అంతే కేర్ తీసుకున్నారు.
ఈ సినిమా రిలీజ్ వెర్షన్ ప్రభాస్ చూసి మార్పులు సూచించారని టాక్ వినిపించింది. స్క్రీన్ ప్లే మరింత క్రిస్పీగా ఉండేలా ఎడిట్ ప్యాటర్న్ లో కొన్ని మార్పులు చేయమని ప్రభాస్ డైరెక్టర్ కి సూచించినట్లు సమాచారం. మరి డార్లింగ్ ఛేంజెస్ ఎక్కడెక్కడ కోరారు? అన్నది తెలియాలి. చిత్రం సమయాన్ని తగ్గించడానికి వీలైనంత ట్రిమ్ చేశారట. ప్రభాస్ దగ్గరుండి మరీ ప్రతిదీ కేర్ తీసుకుని ఈ సినిమాని హిట్ చేసేందుకు తపిస్తున్నారని టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.