విజయ్ దేవరకొండ రష్మిక మందన జోడికి ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉంది. గీత గోవిందం సినిమాతో ఈ జోడి ప్రభావం జనాల మీద బాగానే చూపించింది. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ ఇద్దరి జంటకు మంచి డిమాండ్ వచ్చింది. ఆ వెంటనే ఈ ఇద్దరూ కలిసి డియర్ కామ్రేడ్ మూవీని చేశారు. ఆ సినిమా కమర్షియల్ పరంగా ఆడకపోయినా కూడా ఇప్పటికీ అది చాలా మందికి ఆల్ టైం ఫేవరేట్గా నిలుస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి గురించి రకరకాల రూమర్లు వచ్చేవి.
రష్మిక, విజయ్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని అందుకే.. ఎక్కువగా విజయ్ ఫ్యామిలీతోనే రష్మిక కనిపిస్తోందంటూ రూమర్లు వచ్చాయి. ఇక పండుగలు వచ్చిన సమయంలో అయితే విజయ్ తల్లితో రష్మిక కనిపింస్తూఉండేది. విజయ్ మదర్ బర్త్ డే సందర్భంగా రష్మిక స్పెషల్ పోస్టులు పెట్టేది. మొన్నటి న్యూయర్ వేడుకలు కూడా కలిసే సెలెబ్రేట్ చేసుకున్నారు.
మొత్తానికి ఇలా అన్నింటిని బేరీజు వేసుకుని ఈ ఇద్దరి మీద రకరకాల రూమర్లు వస్తున్నాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని కథనాలు వచ్చేవి. అయితే నేడు జాతీయ మీడియా కూడా ఎక్కువగా వీరిద్దరి పెళ్లికి సంబంధించిన కథనాలను అల్లేసింది. దీనిపై విజయ్ దేవరకొండ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
మామూలుగానే విజయ్ దేవరకొండ అగ్రెసివ్గా రియాక్ట్ అవుతాడనే విషయం తెలిసింది. తన మీద వచ్చే నెగెటివ్ వార్తలు, రూమర్ల మీద ఫైర్ అవుతుంటాడు. ఇక ఈరోజు ఉదయం నుంచి వచ్చిన ఈ పిచ్చి రాతల మీద తన స్టైల్లో కౌంటర్లు వేశాడు. ఎప్పటిలానే చెత్త వార్తలు, నాన్ సెన్స్ అంటూ తిట్టిపోసేసాడు విజయ్. రాయలేనటువంటి బూతుతో రెచ్చిపోయాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.
విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్తో లైగర్ సినిమాను పూర్తి చేశాడు. జన గణ మన అనే సినిమాను కూడా ప్రారంభించేశాడు. ఆ తరువాత సుకుమార్తో విజయ్ ఓ సినిమాను చేయబోతున్నాడు.