Yakutsk In Russia : ఈ ఏడు శీతాకాలం ప్రపంచాన్ని వణికిస్తోంది. అత్యంత దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు చలికి తట్టుకోలేకపోతున్నారు. శీతల ప్రదేశాల్లో చాలా చోట్ల మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచు కురుస్తూ ప్రజల జనజీవనాన్ని స్తంభిపజేస్తున్నాయి. ఇక భారత్లోనూ అత్యల్పంగా 1.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోయి ఎన్నడూ లేనంతంగా చలి గాలులు ప్రజలను అల్లాడిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు ఒక్క డిగ్రీకి పడిపోతేనే ఇంతలా వణుకుతుంటే మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు పడిపోయే ప్రాంతంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రత్యక్షంగా చెప్పనవసరం లేదు. అయితే ఓ ప్రాంతంలో కనీవినీ ఎరుగని రీతిలో మైనస్ 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో నగర ప్రజలు అల్లాడుతున్నారు.
భూమిపై అత్యంత శీతల ప్రదేశంగా పేరొందిన రష్యాలోని సైబీరియాలో ఉన్న యాకుట్స్క్ ప్రాంతంలో ఈ వారం ఉష్ణోగ్రతలు మైనస్ 50 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. మాస్కోకు తూర్పున 5,000 కి.మీ దూరంలో ఉన్న మైనింగ్ సిటీ, థర్మామీటర్ మైనస్ 40 కంటే తక్కువగా పడిపోతుంది. ఈ వారం, నగరంలో రికార్డు అయిన ఉష్ణోగ్రతలు అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఎందుకంటే ఉష్ణోగ్రత -50 డిగ్రీల మార్కుకు పడిపోయింది.
అయితే ఈ ఉష్ణోగ్రతలతో ఎవరూ పోరాడలేరని, తదనుగుణంగా దుస్తులు ధరించాలని లేదంటే బాధపడతారు అని అనస్తాసియా గ్రుజ్దేవా వార్తా సంస్థ రాయిటర్స్తో పేర్కొన్నారు. కఇక్కడి ప్రజలతు తీవ్రమైన చలిని శీతలగాలులను ఎదుర్కొనేందుకు తమను తాము సిద్ధం చేసుకుంటున్నారు. ఒంటి చుట్టూ వెచ్చని బట్టలను క్యాబేజీ పొరల్లాగా చుట్టుకుంటున్నారు. చలిని ఎదుర్కోవడానికి ఇంతకు మంచిన రహస్యాుల ఏమీ లేవని తెలిపారు. వెచ్చగా దుస్తులు ధరించడం ఒక్కటే మార్గమని స్థానికులు చెబుతున్నారు..
తమ మైండ్ను ఈ చలిని ఎదుర్కోవడానికి సిద్ధపరుచుకున్నామని పేర్కొన్నారు. అయితే ఈ తీవ్రమైన చలి, సిటీలోని ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పైన ప్రభావం చూపవచ్చు అని చాలా మంది నివాసితులు భయపడుతున్నారు. ఈ సుదీర్ఘ శీతాకాలం ఇప్పట్లో ముగిసే సూచనలు లేకపోవడంతో, నగరంలో ఇంధన మౌలిక సదుపాయాలపై ప్రభావం పెద్దగా ఉంటుందని నివాసితులు భయపడుతున్నారు.