ఓ వైపు అధికార పార్టీ వైసీపీ రాబోయే ఎన్నికలలో ఏకంగా 175 స్థానాలలో గెలవాలని గట్టిగా కంకణం కట్టుకున్నారు. ఈ విషయాన్ని పదే పది ఎమ్మెల్యేలకి, నియోజకవర్గాల వారీగా జరిగే సమావేశాలలో నాయకులకి చెబుతూ దిశానిర్దేశం చేస్తున్నారు. సంక్షేమ పథకాలలే మనల్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొని వస్తాయని జగన్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నారు. అయితే గ్రౌండ్ లెవల్ సిచువేషన్ ఎలా ఉంది అనే విషయాలు కూడా జగన్ రెడ్డికి క్లారిటీ లేదనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. అస్సలు ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పే మాటల కంటే తాను పెట్టుకున్న పొలిటికల్ స్ట్రాటజీ టీమ్ ఐ ప్యాక్ ని జగన్ రెడ్డి ఎక్కువగా నమ్ముతున్నారు. అయితే గడపగడపకి వెళ్తున్న ఎమ్మెల్యేలకి ప్రజల నుంచి అసహనం ఎదురవుతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఐ ప్యాక్ మంత్రులపై సర్వే నిర్వహించినట్లు తెలుస్తుంది. అయితే ఈ సర్వేలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి షాక్ ఇచ్చే విధంగా గ్రౌండ్ లెవల్ నుంచి వచ్చిన ఫలితాలు ఉన్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న 13 మంత్రి మంత్రులలో కేవలం 5 మంది మాత్రమే సేఫ్ జోన్ లో ఉన్నారని ఐ ప్యాక్ నిర్హారించినట్లు తెలుస్తుంది. పుంగనూరు, తుని, కడప, గంగాధర్ నెల్లూరు, అమలాపురం నియోజకవర్గాలలో మాత్రమే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు తిరిగి గెలిచే అవకాశం ఉందని ఐ ప్యాక్ సర్వే తెల్చేసినట్లు తెలుస్తుంది. వారు కూడా స్వల్ప మెజారిటీతోనే గట్టెక్కుతారని బోగట్టా.
ఇక మిగిలిన మంత్రులకి మాత్రం ఈ సారి ఎదురుదెబ్బ తగలడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది. ఉత్తరాంద్రలో ఉన్న నలుగురు మంత్రులకి ఓటమి తప్పదని తెలుస్తుంది. అలాగే మాజీ మంత్రులలో కూడా చాలా మంది ఓటమి అంచున ఉన్నట్లుగా ఐ ప్యాక్ సర్వేలో తేలినట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఈ సర్వే ఫలితాలు ఇప్పటికే జగన్ దృష్టికి వెళ్ళినట్లుగా కూడా చర్చ నడుస్తుంది. ఇక ఎమ్మెల్యేలలో అయితే చాలా మంది సిట్టింగ్ లు తమ స్థానాలు కోల్పోయే అవకాశం ఉందని టాక్. జనసేన, టీడీపీ పొత్తు ఉంటే మాత్రం వైసీపీ గత ఎన్నికలలో ఎంత భారీ మెజారిటీ సొంతం చేసుకుందో ఈ సారి అంత ఘోరమైన ఫలితాలని చూడబోతుంది అనే మాట కూడా వినిపిస్తుంది. ఐ ప్యాక్ ఇచ్చిన సర్వే ఫలితాలని దృష్టిలో ఉంచుకొని తానే నేరుగా ప్రజల్లోకి వెళ్లి మాట్లాడితేనే ఫలితం ఉంటుందనే నిర్ణయానికి జగన్ రెడ్డి వచ్చినట్లుగా వైసీపీ వర్గాలలో వినిపిస్తున్న మాట.