వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ సీబీఐ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో వైఎస్ వివేకా కారు డ్రైవర్ ఇప్పటికే అప్రూవర్ గా మారిపోయి సీబీఐ విచారణకి సహకరిస్తున్నారు. అయితే ఆయనని చంపింది మేమే అని చెప్పి ఇప్పటికే సీబీఐకి అన్ని విషయాలు ఓపెన్ అయ్యి చెప్పిన కూడా మూడేళ్ళ నుంచి కేసులో ఎలాంటి పురోగతి లేకుండా సాగుతుంది.
దీంతో వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు కేసుని వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని అభ్యర్ధించడంతో తెలంగాణకి బదిలీ చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణకి బదిలీ చేసాక కేసులో కాస్తా పురోగతి వచ్చింది. కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరికి కూడా సీబీఐ విచారణకి రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది.
ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ కూడా చేసింది. ఇదిలా ఉంటే ఈ కేసు విచారణలో భాగంగా వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. విచారణకి రావాలని కోరింది. అయితే ఈ విచారణకి వైఎస్ అవినాష్ రెడ్డి ఇటు వెళ్ళడం, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన విశాఖ పర్యటనని క్యాన్సిల్ చేసుకొని ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అదే సమయంలో అవినాష్ రెడ్డి సీబీఐ ఆఫీస్ కి వెళ్ళడానికి ముందు విజయమ్మని కలిసారు. మరో వైపు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మీడియా ముందుకి వచ్చి వైఎస్ వివేకాంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
వైఎస్ వివేకానంద హంతకులు ఎవరనేది ఇప్పటికే తెలిసిపోయింది అని, కావాలని అవినాష్ రెడ్డిని ఇరికించే కుట్ర జరుగుతుందని అన్నారు. అలాగే ఆయన విచారణని వీడియో షూట్ చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో అవినాష్ రెడ్డి కడిగిన ముత్యంల బయటకి వస్తాడని పేర్కొన్నారు. ఇక విచారణకి అవినాష్ రెడ్డి హైదరాబాద్ వెళ్ళగా ఆయనతో పాటు శ్రీకాంత్ రెడ్డి వెళ్ళడం విశేషం.
ఇక సీబీఐ విచారణ ముగిసిన తర్వాత అవినాష్ రెడ్డి బయటకి వచ్చి మీడియాతో మాట్లాడినపుడు ఆ ఎమ్మెల్యే అక్కడే ఉన్నారు. దాంతో పాటు అవినాష్ రెడ్డి అనుచరులు కూడా పెద్ద ఎత్తున అక్కడ హడావిడి చేశారు. అయితే ఇదంతా చూసిన వారికి అవినాష్ రెడ్డిని విచారణకి పిలిస్తే ముఖ్యమంత్రి నుంచి వైసీపీ నాయకులు అందరూ ఎందుకు ఇంత భయపడుతున్నారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.