YS Jagan: ఏపీలో పరిశ్రమలు ఏర్పాటు జరగడం లేదని, పెట్టుబడులు రావడం లేదని ప్రతిపక్షాలు పదేపదే చేస్తున్న విమర్శలు. అయితే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ముఖ్యమంత్రి జగన్ మాస్టర్ ప్లాన్ వేశారని చెప్పాలి. ఇన్ని రోజులు పెట్టుబడులను ఆకర్షించడంలో వెనుకబడ్డారని విపక్షాలు చేసే విమర్శలకు రికార్డు స్థాయిలో పారిశ్రామిక ఒప్పందాలు చేసుకొని తమ సత్తా ఏంటో చూపించాలని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. దీనికి విశాఖను వేదికగా మార్చుకుంటుంది. ఏపీలో ఇన్ని రోజుల రాజధాని రచ్చ నడిచింది. అయితే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రాజెక్ట్ చేయడంతో పాటు దానిని ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ స్థాయిలో అంతర్జాతీయ వ్యాపారుల దృష్టికి బలంగా తీసుకుని వెళ్ళగలరు. అలాగే విశాఖపట్నం పరిశ్రమలకు ఎంత అనువైన ప్రాంతము అనేది చూపించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే విశాఖ వేదికగా గ్లోబల్ సమ్మిట్ కూడా జరగబోతుంది.
దీనికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు అందరు కూడా హాజరు కాబోతున్నారు. ఈ సమ్మిట్ లో అంబానీ, బిర్లా, ఆదాని, బంగూర్, దాల్మియా లాంటి ఇండస్ట్రీయలిస్టులు హాజరవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సమ్మిట్ ద్వారా నాలుగు లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇక తాజాగా ఓ జాతీయ ఛానల్ గురించి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి జగన్ ఏపీలో పరిశ్రమలకు ఏ విధంగా అనుకోవాలి అనేది తెలియజేశారు. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం, నిరంతర విద్యుత్ సరఫరా ఏపీలో ఉంటుందని చెప్పారు.
దేశంలో 11 పారిశ్రామిక కారిడార్లు ఉంటే అందులో మూడు ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉన్నాయని తెలియజేశారు. అలాగే రాష్ట్రంలో 408 రకాల కనీస నిక్షేపాలు లభ్యమవుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో 6 పోర్ట్స్ ఉన్నాయని కొత్తగా నాలుగు పోర్టులు నిర్మిస్తున్నామని తెలిపారు. పోర్టు ఆధారిత పరిశ్రమలకు రాష్ట్రం అనుకూలంగా ఉంటుందని అన్నారు. కార్బన్ ఉధ్గారాలను తగ్గించే పర్యావరణ పరిరక్షణకు మేలు చేసే గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తు అంతా. ఈ రంగంలోకి ఏపీ మంచి అవకాశం ఉంది అని చెప్పారు. అలాగే వృద్ధిరేటులో 11.43%తో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని గుర్తు చేశారు. ఇలా పారిశ్రామికీకరణకు అనువైన వాతావరణం విశాఖపట్నంలో సుదీర్ఘ తీర ప్రాంతంలో ఉందని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ బలమైన సందేశాన్ని అందించారు మాట వినిపిస్తుంది.