YS Jagan: ప్రతిపక్షాలు ఎన్ని డ్రామాలు ఆడిన వాటికి ఒక్క మీటింగ్ తో ముఖ్యమంత్రి జగన్ ఫుల్ స్టాప్ పెడుతూ ఉంటారనేది అందరికి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలు చేసే కుట్రలని కూడా తన ప్రసంగాలతో జగన్ ఆధారాలతో సహా బయటపెడతారు. దీంతో అంత వరకు తమదే పైచేయి అనుకునే టీడీపీ, జనసేన నాయకుల నోట్లో పచ్చి వెలక్కాయ పడుతుంది. ఇక జగన్ స్ట్రాటజీలో ఇరుక్కున్న వారికి మళ్ళీ బయట పడి బురద జల్లడానికి మరికొద్ది రోజుల సమయం పడుతుంది. పవన్ కళ్యాణ్ పార్ట్ టైమ్ పోలిటిక్స్, దత్త తండ్రి చంద్రబాబు కోసం చేస్తున్న త్యాగాలని జనసైనికులకి కూడా వైఎస్ జగన్ అర్ధం అయ్యేలా చెబుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండానే అతని ఇమేజ్ ఏంటో, నైజం ఏంటి అనేది చెప్పేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే 2024 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటికే టీడీపీ, జనసేన పొట్టుల పల్లవి అందుకొని జగన్ ని ఓడించడానికి కుట్రలు చేస్తున్న సంగతి తెలిసిందే.
అందులో భాగంగా వైసీపీ నాయకులని కూడా ఏవో ఆశ చూపించి బయటకి లాగేస్తున్నారు. అయితే దీనికి జగన్ దగ్గర పవర్ ఫుల్ సమాధానమే ఉంది. అందుకే వైసీపీని వీడి బయటకి వెళ్తున్న నాయకుల స్థానంలో కొత్తవారికి అవకాశాలు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే మార్చి 18 నుంచి ముఖ్యమంత్రి జగన్ కొత్త రాజకీయ కార్యాచరణతో ప్రజలలోకి వెళ్తున్నారు. గృహ సారథులతో ఇప్పటికే బలమైన ప్రచార వ్యవస్థని తయారు చేసుకున్న జగన్ వారితో ఎన్నికల్ వ్యూహలని అమలు చేయబోతున్నారు. అదే సమయంలో తాను కూడా బయటకొచ్చి పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీ కారం చుడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామంలో పల్లె నిద్ర చేయాలని జగన్ డిసైడ్ అయ్యారు. దీని ద్వారా ఆ నియోజకవర్గ ఓటింగ్ పై బలమైన ప్రభావం చూపించబోతున్నారు.
అలాగే సంక్షేమ పథకాలని ప్రజలలోకి బలంగా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రహదారుల అభివృద్ధి కోసం నిధులని మంజూరు చేసి ఎన్నికల సమయానికి ఏపీ అన్ని రహదారులు అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పరిశ్రమల స్థాపన కోసం భూమి కేటాయించి వాటింగ్ ఫౌండేషన్ స్టోన్ వేయడం ద్వారా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలని పూర్తి చేసి స్థానిక యువతకి ఉపాధి కల్పిస్తామని భరోసా ఇవ్వబోతున్నారు. ఇలా బలమైన ప్రచార ఆయుధాలతో మార్చి 18 నుంచి జగన్ స్ట్రాటజీ అమల్లోకి రానుంది. వాటి ధాటికి ప్రతిపక్షాలు వెనక్కి పోవడం ఖాయం అనే మాట వినిపిస్తుంది.