YS Jagan: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ, ముఖ్యమంత్రి జగన్ తన నాయకులు అందరికి టార్గెట్ 175 అంటూ చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించాలని దిశానిర్దేశ్యం చేస్తున్నారు. కుప్పం లాంటి బలమైన నియోజకవర్గంలోనే కార్పోరేషన్ ని సొంతం చేసుకున్నామని, ఇక మిగిలిన అసెంబ్లీ స్థానాలలో గెలవడం కష్టం కాదని జగన్ పదే పదే చెబుతున్నారు. ఒకప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీలోని మెయిన్ లీడర్స్ తో అంతర్గత సంబంధాలు ఉండేవి. ఈ కారణంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుప్పంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు మీద బలమైన అభ్యర్ధిని నిలబెట్టలేదు. అలాగే రాజశేఖర్ రెడ్డి మీద చంద్రబాబు కూడా బలమైన అభ్యర్ధులని నిలబెట్టే ప్రయత్నం చేయలేదు.
అయితే ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఉప్పు నిప్పు అన్న చందంగా ఉంది. అందుకే గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాలలో కూడా బలమైన అభ్యర్ధులని రెండు పార్టీలో బరిలో దించాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. ఇప్పుడు జగన్ కూడా కుప్పం నియోజకవర్గం లో భరత్ ని ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించేశారు. అలాగే పెద్దిరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. చంద్రబాబుని ఆ నియోజకవర్గంలో ఓడించడానికి ఉన్న దారులు అన్ని వెతుకుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమాల ద్వారా ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల గురించి చెబుతున్నారు.
నెక్స్ట్ గ్రామ సారథులని నియమించారు. వారు కూడా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరు లబ్ది పొందుతున్నారు. ఈ అలాగే విశాఖని రాజధానిగా ప్రకటించి పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకి పెద్ద పీట వేయబోతున్నారు. అలాగే రాయలసీమని కూడా ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇదే సమయంలో సామాజిక సమీకరణాల ఆధారంగా నాయకుల ఎంపిక జరుగుతుంది. ఎమ్మెల్యే అభ్యర్ధుల ఖరారు కూడా అలాగే ఉండబోతుంది. మెజారిటీ కమ్యూనిటీ ఉన్న నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలుగా ఆ వర్గానికి చెందినవారికి ప్రాధాన్యత ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. ఇలా అన్ని వ్యూహాలని పెర్ఫెక్ట్ గా మాలు చేస్తూ 175 నియోజకవర్గాలలో గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.