YSRCP: ఏపీ రాజకీయాలలో వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావడానికి టీడీపీ అధినేత చంద్రబాబు గట్టి వ్యూహాలు వేస్తున్నారు. వైసీపీ సంక్షేమ పథకాలు ఆ పార్టీకి బలంగా ఉన్నాయి. ఇప్పటికే ప్రజలలో జగనన్న పాలనపై పాజిటివ్ అభిప్రాయం ఉంది. వచ్చే ఎన్నికలలో కూడా జగన్ ని మరల గద్దె ఎక్కించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే మాట వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో ఎలా అయిన ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలని చంద్రబాబు వ్యూహాలు వేశారు. అందులో భాగంగా నారా లోకేష్ ని పాదయాత్ర పేరుతో రోడ్ల మీదకి పంపించారు. నిజానికి పాదయాత్ర అతని సామర్ధ్యానికి మించిన పని అని రాజకీయ విశ్లేషకులు చెప్పే మాటలు. అయినా కూడా నారా లోకేష్ జనలోకి వెళ్తే నాయకుడిగా మారిపోతాడని చంద్రబాబు భావించారు.
అందుకే పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి పంపించారు. అయితే ఆరంభంలో నారా లోకేష్ పాదయాత్రలో కొంత అతిగా ప్రవర్తిస్తూ స్థానికంగా వైసీపీ కార్యకర్తలని, నాయకులని రెచ్చగొట్టేవారు. దీంతో వైసీపీ కార్యకర్తలు కోపంతో లోకేష్ ని అడ్డుకునే ప్రయత్నం చేసేవారు. దానిని తన అనుకూల మీడియాతో ఫోకస్ చేయించి ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నాయి అని ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే అయితే ముఖ్యమంత్రి జగన్ దీనిని గ్రహించి నియోజకవర్గాల నాయకులకి స్పష్టమైన దిశానిర్దేశ్యం చేసినట్లు తెలుస్తుంది. అసలు నారా లోకేష్ ఎలాంటి విమర్శలు చేసిన పట్టించుకోవద్దని సూచించినట్లు తెలుస్తుంది.
అసలు అతని పాదయాత్రని ప్రజలే పట్టించుకోవడం లేదని, అయితే మన వాళ్ళు అతనిని అడ్డుకోవడం వలన అనవసరమైన ప్రచారం మనమే కల్పిస్తున్నామని జగన్ అందరికి చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం లోకేష్ పాదయాత్రని వైసీపీ శ్రేణులు అస్సలు పట్టించుకోవడం మానేశారు. తాజాగా వైసీపీ కంచుకోట లాంటి పీలేరు, పుంగనూరు నియోజకవర్గాలలో నారా లోకేష్ పాదయాత్ర ప్రశాంతంగా సాగిపోయింది. అస్సలు ఈ పాదయాత్రపై పెద్దిరెడ్డి వర్గం ఎలాంటి ఫోకస్ పెట్టలేదు. కనీసం రెస్పాండ్ కూడా కాలేదు. దీనిని బట్టి వైసీపీ లోకేష్ పాదయాత్రని పట్టించుకోవడం మానేసింది అనే మాట ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.