భారతీయ జనతా పార్టీ తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ లోక్ సభ సభ్యుడు జి కిషన్ రెడ్డిని నియమించింది. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని పార్టీ మంగళవారం మధ్యాహ్నం ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్లో ఏపీ భాజపా అధ్యక్షుడిగా సోము వీర్రాజు స్థానంలో పురందేశ్వరికి భాజపా పార్టీ పగ్గాలు అప్పగించింది.
రాష్ట్రంలో దాదాపు నాలుగేళ్ల పాటు పార్టీని నడిపించిన బండి సంజయ్కుమార్ స్థానంలో కిషన్రెడ్డిని నియమించారు. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఇతర సీనియర్ నేతలతో సమావేశమైన సంజయ్, పదవికి రాజీనామా చేయాలని కోరారు.
మరో ముఖ్యమైన పరిణామంలో, హుజురూరాబాద్కు చెందిన పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను రాష్ట్ర పార్టీ యూనిట్ ప్రచార కమిటీ చైర్మన్గా నియమిస్తున్నట్లు బిజెపి ప్రకటించింది.
ఇక ఏపీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తున్నట్లు ఆ పార్టీ తెలిపింది.