తాను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తనను ఆదరించి ప్రోత్సహించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలందరికీ తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.
బీజేపీ సీనియర్ నాయకులు, అన్ని మోర్చాలు, సంగ్రామ సేన సభ్యులు, రాష్ట్ర పార్టీ కార్యాలయ ఉద్యోగులు, సోషల్ మీడియా యోధులు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
ప్రజాసంగ్రామయాత్రలో అడుగడుగునా తనకు అండగా నిలిచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ ఓటర్లు, కార్యకర్తలకు రుణపడి ఉంటానని అన్నారు.
“శ్రీ @kishanreddybjp గారి సమర్ధవంతమైన నాయకత్వంలో నేను పార్టీ కోసం కొత్త ఉత్సాహంతో పని చేయడానికి ఎదురు చూస్తున్నాను” అని సంజయ్ ట్వీట్ చేశారు.
@BJP4Telangana రాష్ట్ర అధ్యక్షుడిగా అధికారికంగా రాజీనామా చేస్తున్నాను.
గౌరవనీయులైన PM శ్రీ @narendramodi ji, Hon’ble HM శ్రీ @AmitShah ji మరియు @BJP4India ప్రెసిడెంట్ శ్రీ @JPNadda ji, Shri @blsanthosh ji, Shri @shivprakashbjp జీ, శ్రీ @tarunchughbjp జీ, శ్రీ @sunilbansalbjp జీ, శ్రీ @sunilbansalbjp జీకి ధన్యవాదాలు …
—ఇట్లు, బండి సంజయ్ కుమార్ (@bandisanjay_bjp) జూలై 4, 2023