తానా మహాసభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. అక్కడ కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డి అనవసరమైన వ్యాఖ్యలతో ఇరుక్కుపోయారు. కేవలం రైతులకు 3 గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుందని రేవంత్ తెలిపారు. దింతో రేవంత్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ వ్యాఖ్యలపై అధికార బీఆర్ఎస్ మండిపడుతోంది. టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలు దుమారం రేపుతుండటంతో.. మంత్రి కేటీఆర్ దీనిపై స్పందించారు. రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. మొత్తానికి రేవంత్ టోటల్ గా కార్నర్ అయ్యారు.
తెలంగాణలో 3 ఎకరాల లోపు సన్నకారు రైతులే చాల మంది ఉన్నారు కాబట్టి , 3 ఎకరాలకు నీళ్ళు కావాలంటే 3 గంటలు సరిపోతుంది. మొత్తం మీద రోజుకి 8 గంటల విద్యుత్ సరిపోతుంది, 24 గంటల కరెంట్ తెలంగాణ ప్రజలకి అనవసరమని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు కేటిఆర్ మండిపడుతున్నారు. కాంగ్రెస్ రైతులకు ద్రోహం చేసే పార్టీ అని, రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగ అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని సూచించారు.