ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీడీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి గెలుపును దృష్టిలో ఉంచుకుని కడపలో తన మూడు రోజుల పర్యటనలో పార్టీ విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు.
అక్కడ అనేక పథకాలను ప్రారంభించడం, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన ముఖ్యమంత్రి సార్వత్రిక ఎన్నికలలోపు పార్టీ బలోపేతానికి మరింత అంకితభావంతో పనిచేయాలని స్థానిక నాయకులకు పిలుపునిచ్చారు.
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయలసీమలోని పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి విజయం సాధించారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి కంచుకోటలైన కడప జిల్లాలో కూడా తెదేపా అభ్యర్థి ఓట్లను సాధించినట్లు సమాచారం.
పులివెందుల నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా పులివెందుల మున్సిపల్ కౌన్సిలర్లతో జగన్ మాట్లాడి ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కడప ప్రజాప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి జగన్, జిల్లాలో భూకబ్జా సమస్యలు, రియల్ ఎస్టేట్ వ్యాపారంకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురు నేతలను అయన హెచ్చరించారు.
రియల్ ఎస్టేట్ వివాదాలకు సంబంధించి ఇటీవల జరిగిన కిడ్నప్ లు, హత్యల అంశాలను ప్రస్తావించిన జగన్.. పార్టీకి చెడ్డపేరు రాకుండా చూడాలని పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.