యువగళం పాదయాత్రలో తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రమాదం నుండి బయట పడ్డారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో జనం మీద పడటంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యారు. నారా లోకేష్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది క్షణంలో అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈ తోపులాటలో మూడుసార్లు కిందపడే ప్రమాదం నుండి నారా లోకేష్ బయటపడడం జరిగింది. జనం తోపులాటలో తరచుగా లోకేష్ చేతులు, కాళ్లకు గాయాలవుతున్నాయి.
ఈ క్రమంలోనే లోకేష్ పాదయాత్రలో జనాన్ని అదుపు చేయడంలో రాష్ట్ర పోలీసులు విఫలమవుతున్నారని తెలుగు దేశం పార్టీ నేతలు ఆరోపించడం జరిగింది. పోలీసులు కావాలనే లోకేష్కు భద్రత కల్పించడం లేదని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దల ఒత్తిడితోనే పాదయాత్రకు భద్రత తగ్గించారని విమర్శించారు. కందుకూరు, గుంటూరు ఘటనలు మల్లి రిపీట్ అయ్యేలా కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు.