వివిధ రాజకీయ పార్టీలకు అసెంబ్లీ ఎన్నికల జ్వరం మెల్లగా పట్టుకోవడంతో పార్టీ టిక్కెట్ల విషయంలో బీఆర్ఎస్లో రచ్చ మొదలైంది. జనగాం జిల్లాలో అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డికి, మరో వర్గం ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డికి మద్దతుగా నిలుస్తోంది.
గురువారం జనగాం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బీ సిద్ది లింగయ్య ఆధ్వర్యంలో యాదగిరిరెడ్డికి మద్దతుగా నిలిచే వారు సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్రెడ్డికి పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించరాదని డిమాండ్ చేశారు.
ఆయన ప్రజలకు చేసిందేమీ లేదని, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని, ఇప్పుడు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నేతృత్వంలో సర్వతోముఖాభివృద్ధికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.
- Read more Political News