వైస్ కుటుంబంలో మరోసారి విబేదాలు బట్టబయలైయ్యాయి. ఈ నెల 8న ఇడుపులాపాయలో జరిగే వైస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తన షెడ్యూల్ మార్చగుకున్నట్లు సమాచారం. చెల్లెలు షర్మిల 7వ తేదీ రాత్రికి వస్తుంది అని తెలిసి ఎన్నడూ లేని విదంగా 8వ తేదీ సాయంత్రం వెళ్లనున్నారు సీఎం జగన్. చెల్లెలు షర్మిల తల్లి విజయలక్ష్మి ని కలవకూడదని పట్టుదల తోనే జగన్ తన షెడ్యూల్ మార్చుకున్నట్లు స్థానికుల్లో చర్చ జరుగుతుంది.
గత ఏడాది వైస్ వర్ధంతి సందర్బంగా షర్మిల రాత్రికి రాత్రే హైదరాబాద్ వెళ్లిపోయారు. ప్రతిసారి 8వ తేదీ ఉదయం 8 గంటలకు తండ్రి సమాధికి నివాళులు అర్పించే జగన్, మొట్టమొదటిసారిగా సాయంత్రానికి తన షెడ్యూల్ మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.