Guppedantha Manasu: ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర వర్మ, జగతి కారులో ప్రయాణిస్తూ ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటారు. ఇక మహేంద్ర.. రేపు ఉదయం లేచేసరికి రిషి నా కళ్ళ ముందు ఉంటాడని అనడంతో జగతి బాధపడొద్దు అని ధైర్యం ఇస్తుంది. ఇక రిషి, వసు కూడా కారులో ప్రయాణిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వసు తన ఇంటికి వెళ్ళిపోతుంది.
ఇక మరుసటి రోజు ఉదయాన్నే ప్రగతి ఫోన్ నుంచి వసుకు మెసేజెస్ వస్తాయి. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి నువ్వే చూసుకోవాలి అని బాధ్యతలు అప్పజెప్తుంది. దాంతో వసు ఆశ్చర్య పోతుంది. తిరిగి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక రిషి కూడా గదిలో తన తండ్రి లేకపోయేసరికి షాక్ అవుతాడు. వెంటనే దేవయానిని అడగటంతో దేవయాని అమాయకంగా నటిస్తూ నా మాట వినకుండా వెళ్ళిపోయారు అని అంటుంది.
ఇక రిషి ఎందుకు ఆపలేదు అంటూ దేవయానిపై అరుస్తాడు. దాంతో దేవయాని తన మనసులో రిషి బాధపడతాడు అనుకుంటే నాపై అరుస్తున్నాడు ఏంటి అని అనుకుంటుంది. ఇక రిషి డాడ్ ఎక్కడికి వెళ్లారు అని బాధపడుతూ ఉంటాడు. మీరేమైనా డాడీని అనరాని మాటలు అన్నారా అంటూ దేవయాని అడుగుతాడు.
అప్పుడే అక్కడికి గౌతమ్ వచ్చి ఏం జరిగింది అనటంతో దేవయాని వెటకారంగా జగతి వాళ్ళు వెళ్లిపోయారు అని చెబుతుంది. ఇక రిషి కంగారు పడటంతో గౌతమ్ ధైర్యం ఇస్తూ ఉంటాడు. మధ్యలో దేవయాని వెటకారంగా మాట్లాడుతుంటే గౌతమ్ మీరు ఆపండి పెద్దమ్మ అని అంటాడు. ఇక ధరణి కూడా తన మనసులో ఈవిడ ఏదో ఒకటి చేసింది అని అనుకుంటుంది.
ఆ తర్వాత గౌతమ్ రిషికి ధైర్యం చెప్పి అక్కడ నుంచి వెళ్తాడు. ఇక రిషి మాత్రం బాధపడుతూ ఉంటాడు. తెలియకుండా వాళ్ళని ఏమైనా అన్నానా అంటూ పెద్దమ్మతో అంటాడు. వెంటనే దేవయాని కావాలని.. లేనిపోని చాడీలు చెబుతుంది. ఈమధ్య మహేంద్ర కు నీ మీద ప్రేమ తగ్గిపోతుంది అని అనటంతో లేదు డాడీ నన్ను ప్రేమగా చూసుకుంటారు అని అంటాడు.
Guppedantha Manasu:
మీరు ఏమైనా అన్నారా అని రిషి అడుగుతాడు. దాంతో ఏమీ లేదు అని దేవయాని అంటుంది. ఇక గౌతమ్ జరిగిన విషయం మొత్తం వసు కు చెబుతాడు. ఇక వసును చి దగ్గర ఉండమని చెబుతాడు. ఇక రిషి దేవయానితో తన డాడ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. చాలా బాధపడుతూ కనిపిస్తాడు. అప్పుడే అక్కడికి వసు వచ్చి పిలవటంతో వెంటనే రిషి ఎమోషనల్ గా కనిపించడం లేదు అని వసుతో అంటాడు. ధైర్యం చెబుతూ ఉంటుంది. తర్వాత వసు స్ట్రాంగ్ కాఫీ తెమ్మని దేవయానికి చెప్పటంతో దేవయానికి షాక్ అవుతుంది.