దేశముదురు సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న అందాల భామ హన్సిక మోత్వాని. ఈ అమ్మడు తెలుగు, తమిళ భాషలలో సుదీర్ఘకాలం స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరో సిద్దార్ద్, తరువాత శింబుతో ప్రేమాయణం తరువాత బ్రేక్ అప్ కారణంగా కొంతకాలం కోలీవుడ్ కి దూరమై టాలీవుడ్ లో నటించింది. మళ్ళీ తనని ఎక్కువగా ఆరాధించే తమిళ్ ఆడియన్స్ కోసం అక్కడ సినిమాలు చేస్తూ వస్తుంది.
ఇక ఈమె కెరియర్ లో ఏకంగా 50కి పైగా సినిమాలలో నటించింది. చివరిగా మహా అనే సినిమాతో ఒటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ మూవీ ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈమె తాజాగా పెళ్లి కూతురు అయిన సంగతి తెలిసిందే. తన చిన్న నాటి స్నేహితుడిని ఆమె పెళ్లాడబోతుంది. త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతుంది. ఇక పెళ్లి తర్వాత ఆమె పూర్తిగా సినిమాలని పక్కన పెట్టి ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అవ్వాలని అనుకుంటుందని తెలుస్తుంది. ఇప్పటికే భర్తతో కలిసి ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసిందని, దీనిపై ఆమె దృష్టి పెట్టె ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తుంది.
ఇప్పటికే ఆమెకి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఒటీటీలో వెబ్ సిరీస్ లలో అవకాశాలు వస్తున్నాయి. అయితే చేతిలో ఉన్నవాటిని పూర్తి చేసి తరువాత పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టె యోచనలో ఉందనే మాట సౌత్ సర్కిల్ లో వినిపిస్తుంది. ఇంతకాలం హీరోయిన్ గా తనని ఎంకరేజ్ చేసిన ఫ్యాన్స్ కి పెళ్లి తర్వాత భర్తతో కలిసి మీడియా ముందుకి వచ్చి థాంక్స్ చెప్పడంతో పాటు సినిమాలు చేయనని చెప్పడానికి రెడీ అవుతుందని సమాచారం.