Janasena Party: చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ కి ఏ స్థాయిలో బలం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే గత ఎన్నికలలో అక్కడి నుంచి కరణం బలరాం టీడీపీ నుంచి గెలిచారు. ఆమంచి వైసీపీలోకి వెళ్లి టికెట్ తెచ్చుకోవడంతో వైసీపీలో ఎన్నికల ముందు వరకు ఉన్న కరణం బలరాం టీడీపీలోకి చేరి గెలిచారు. ఇక ఎన్నికల తర్వాత కరణం బలరాం బలం అర్ధం చేసుకున్న జగన్ రెడ్డి అతన్ని దగ్గరకి తీసుకున్నారు. కరణం బలరాం కొడుకుని పార్టీలో చేర్చుకున్నారు. తద్వారా ఎమ్మెల్యే బలరాం కూడా వైసీపీ సపోర్టర్ గా మారిపోయారు. ఇదిలా ఉంటే ఆ తరువాత వైసీపీ నుంచి పోటీ చేసిన ఆమంచి కృష్ణ మోహన్ సైలెంట్ అయిపోయారు.
క్రియాశీలకంగా పార్టీ కార్యక్రమాలకి దూరం అయ్యారు. అయితేదగ్గుబాటి వెంకటేశ్వరరారు పార్టీకి రాజీనామా చేయడంలో పర్చూరు నియోజకవర్గం ఖాళీ అయ్యింది. దీంతో ఆమంచిని పర్చూరు నియోజకవర్గానికి ఇన్ చార్జ్ గా వైసీపీ నియమించింది. అయితే ఆమంచి కృష్ణ మోహన్ అయిష్టంగానే పర్చూరు నియోజకవర్గానికి వెళ్ళారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా జనసేనలో చేరడానికి ఆమంచి ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం ఉంది. అయితే దానికి ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఇదిలా ఉంటే తాజాగా చీరాలలో జనసేన సభ్యుత్వ నమోదుకి సంబందించిన కట్టిన బ్యానర్ లో ఆమంచి కృష్ణ మోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసులు ఫోటో దర్శనం ఇచ్చింది. దీంతో అతను జనసేన పార్టీలో త్వరలో చేరబోతున్నాడు అనే టాక్ తెరపైకి వచ్చింది. అయితే ఆమంచి కృష్ణ మోహన్ వెనకుండి దీనిని నడిపిస్తున్నాడు అనే టాక్ వినిపిస్తుంది. కరణం బలరాం ని సపోర్ట్ చేయడంతో తనకి బలమైన చీరాల నియోజకవర్గం నుంచి తనని బయటకి పంపించే ప్రయత్నం చేయడంతో వ్యూహాత్మకంగా ఆమంచి కృష్ణ మోహన్ తన తమ్ముడిని తెరపైకి తీసుకొచ్చి జనసేనలోకి పంపుతున్నారు అనే మాట ఇప్పుడు `రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫ్లెక్సీ వైసీపీ వర్గాల్లో కూడా కలవరం సృష్టిస్తుంది.