AP Politics: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ నుంచి ప్రతిపక్ష పార్టీ టీడీపీ చాలా మంది నాయకులని బయటకి లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారిలో కూడా చాలా మందికి వచ్చే ఎన్నికలలో సామాజిక సమీకరణాలు, పనితీరు ఆధారంగానే సీట్లు ఖరారు చేస్తానని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో చాలా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మళ్ళీ తమకి పోటీ చేసే అవకాశం రాదు అనుకుంటున్న వారి మెల్లగా జారుకుంటున్నారు. టీడీపీ నాయకులతో టచ్ లోకి వెళ్లి అక్కడ టికెట్ ఖరారు అయితే ఏదో ఒక సాకు చూపించి వైసీపీకి మంగళం పాడేయడానికి రెడీగా ఉన్నారు.
ఇక ఎన్నికలు దగ్గర పడే సమయంలో ఎవరెవరు పార్టీలు మారే అవకాశం ఉందనే విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ దగ్గర ఇక లిస్టు ఉందని. ఇప్పుడు బయటకి వెళ్ళిన వారు ఆ లిస్టులో ఉన్నవారే అనే మాట వినిపిస్తుంది. అలాగే త్వరలో కూడా చాలా మంది సిట్టింగ్ లు టీడీపీ గూటికి వెళ్ళే ఛాన్స్ లు అయితే కనిపిస్తున్నాయి. అయితే జగన్ మాత్రం ఆ వెళ్ళిపోయే వారి విషయంలో అస్సలు టెన్షన్ తీసుకోవడం లేదని తెలుస్తుంది.
కచ్చితంగా తమని మళ్ళీ ప్రజలకి చేస్తున్న సంక్షేమమే అధికారంలోకి తీసుకొస్తుందని బలంగా నమ్ముతున్నారు. ఈ నేపధ్యంలో పార్టీ వీడుతున్న వారి స్థానంలో సెకండ్ క్యాడర్ నాయకులని రెడీ చేస్తూ వారికి నియోజకవర్గ పగ్గాలు అప్పగించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సామాజిక సమీకరణాల ఆధారంగా బలమైన నాయకులని గుర్తించే పనిలో ఐప్యాక్ టీం ఉందని తెలుస్తుంది. వారికి ఇన్ చార్జ్ బాద్యతలు అప్పగించడంతో పాటు అభ్యర్ధులుగా కూడా ఖరారు చేయడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని టాక్.