AP Politics: ఏపీ రాజకీయాలలో రోజు రోజుకి సమీకరణాలు మారిపోతున్నాయి. జనసేన పార్టీకి ఓ 10, 20 సీట్లు ఇచ్చి వారిని తమతో కలుపుకోవడం ద్వారా కాపు ఓటింగ్ ని క్యాష్ చేసుకొని గెలవాలని చంద్రబాబు వ్యూహాత్మక ఎత్తుగడలు వేసారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ మీద ప్యాకేజీ స్టార్ అనే ప్రచారం సోషల్ మీడియాలో వినిపిస్తున్న కూడా దానిని ఏ మాత్రం ఖండించడం లేదు. అలాగే ఓ వైపు పొత్తులు అంటూ చర్చిస్తూనే మరో వైపు జనసేన బలం తగ్గించే ప్రయత్నం వ్యూహాత్మకంగా చేస్తుంది. దీనిని ఇప్పటికే ఆ పార్టీ నాయకులు, ముఖ్యంగా జనసేనకి సపోర్ట్ చేసే కాపు నాయకులు గ్రహించారు. తాజాగా కాపు నేత హరిరామజోగయ్య ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ముందే నేరుగా ప్రస్తావించారు.
జనసేనలోకి రావాలనుకున్న కన్నా లక్ష్మినారాయణ, మహాసేన రాజేష్ ని టీడీపీలోకి లాక్కొని పవన్ కళ్యాణ్ కి బలం లేదు అని ప్రాజెక్ట్ చేసే ప్రయత్నం టీడీపీ చేస్తుందని అన్నారు. జనసేన ఎదగకుండా టీడీపీ కుట్రలు చేస్తుంది అంటూ అందరి ముందు స్పష్టం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా తన ప్రసంగంలో ఆంధ్రజ్యోతి వెయ్యి కోట్ల ప్యాకేజీ ప్రచారంపై విమర్శలు చేశారు. తాను ఎవరికి అమ్ముడుపోయే వ్యక్తిని కాదని, అలాగే కాపులు, జనసేన అభిమానుల ఆత్మగౌరవం తగ్గించే పని తాను ఎప్పటికి చేయనని క్లారిటీ ఇచ్చారు.
దీనిని బట్టి టీడీపీ స్పష్టమైన అల్టిమేటం పవన్ కళ్యాణ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మీకు పొత్తు కావాలంటే తగ్గి మమ్మల్ని అందలం ఎక్కించడానికి రావాల్సిందే. లేదంటే మీ ఖర్మ అంటూ తేల్చేశారు. ఇక హరిరామజోగయ్య కూడా పవన్ కళ్యాణ్ ని కాపు సమాజం అంతా కూడా ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటుంది. దానికి ఒకే అనుకుంటే పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకున్న మాకు అభ్యంతరం లేదని చెప్పారు. ఇక కాపులు, బీసీలు అందరూ కూడా జనసేనకి అండగా నిలబడాలని పవన్ కళ్యాణ్ కోరారు. దీనిని బట్టి తమకి అధికార భాగస్వామ్యం ఇస్తేనే మీతో పొత్తు పెట్టుకుంటాం అని పవన్ కళ్యాణ్ టీడీపీకి విస్పష్టమైన సందేశం పంపించారనే మాట వినిపిస్తుంది.