మోహన్ బాబు కూతురు మంచులక్ష్మి , హోస్ట్గానే కాకుండా నటిగాకూడా పలు సినిమాల్లో చేసి మెప్పించింది. అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలోకూడా నటించి మెప్పించింది మంచు వరమ్మాయి పలు టాక్ షోలు, టీవీ షోలు కూడా చేసింది. గుర్తింపు తెచ్చుకుంది. తను మాట్లాడే విధానంపై సెటైర్లు వేసినా.. స్పోర్టివ్గా తీసుకుంటుంది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మంచు వారమ్మాయి తెలుగు నటులకు తెలుగు సినిమాల్లో అవకాశాలు రాకపోవడం గురించి మాట్లాడారు
‘‘ఇక్కడే పుట్టిన నిహారిక ఎందుకు సినిమాలు చేయడం లేదు? బిందు మాధవి, మధుశాలిని, శివాత్మిక, శివాని ఎందుకు చేయడం లేదు? వీళ్లు ఎందులో తక్కువ? అందంతో పాటు టాలెంట్ ఉన్న వారే కదా?’’ అని మంచు లక్ష్మి ప్రశ్నించింది.తెలుగు వాళ్ళకి తెలుగు అమ్మాయిలు నచ్చడం లేదన్నారు. అక్కడే సమస్య వస్తోందన్నారు.
మంచు లక్ష్మి ఫైర్ :
ఏం కర్మ పట్టి ఇక్కడకి వచ్చేసానని ఇప్పుడు అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు.పెళ్లయ్యాక పాప కావాలనుకున్న టైం లో ఇక్కడకు వస్తే మంచిందని అనిపించిందని, ఇప్పుడు పాపకి తొమ్మిదేళ్లు వచ్చాయి.. నాకు రెక్కలు వచ్చినట్లుందన్నారు. ఇక్కడ ఉంటె ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నట్లు ఉంటుందని వచ్చేశానన్నారు.
అక్కడే ఉండి ఉంటె వేరేలా ఉండేదని చెప్పుకొచ్చారు. .అంతే కాకుండా, నేనొక హాలీవుడ్ నటిని.. త్వరలోనే హాలీవుడ్ కి వెళ్ళిపోతాను అని చెప్పుకొచ్చారు. తెలుగులో ఇతర బాషల నుంచి వచ్చిన హీరోయిన్స్ ను ఆదరిస్తారు కానీ.. తెలుగు వారిని ఆదరించారు. అని తెలిపింది. ఇక్కడి ప్రేక్షకులతో పాటు సినిమా మేకర్స్కు కూడా పొరుగు రాష్ట్ర హీరోయిన్లే కావాలని, కానీ తెలుగు వారిని మాత్రం చూడరని ఎంకరేజ్ చేయరని విమర్శలు చేసింది.ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.