మార్క్ ఆంథోని అంటూ విశాల్ మరో ప్రయోగాత్మక సినిమా తీస్తున్నారు . అయన సినిమా హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా రాబోతోన్న కోలీవుడ్, టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. ఈ ఇండస్ట్రీలోను సమానమైన మార్కెట్ ఉన్న హీరోల్లో విశాల్ కూడా ఒకరు. విశాల్ నటించే అన్ని సినిమాలు తెలుగులోకి డబ్ అవుతుంటాయి. ఇప్పుడు మరో సినిమాతో విశాల్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు
ఈ సినిమాలో రీతూ వర్మ నటిస్తూ . ఎస్.జె.సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ కీ రోల్స్లో కనిపించనున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సెప్టెంబర్ 15న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే సినీ మేకర్స్ తెలిపారు.
ఈ సినిమా కోసం విశాల్ తాజాగా పాట పాడిన వీడియో అప్డేట్ ఇచ్చారు. మామూలుగా యంగ్ హీరోలంతా కూడా ఇప్పుడు సింగర్లుగా మారుతున్నారు. ఈ సినిమా నుంచి విశాల్ పాడిన అదరద సాంగ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. విశాల్ ఇందులో సరికొత్తగా కనిపించాడు. విశాల్ , ఎస్.జె.సూర్య కామెడి అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ జి.వి. ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. మార్క్ ఆంటోనీ టైమ్ ట్రావెల్ థీమ్ చుట్టూ తిరిగే కథ అని తెలుస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలతో సినిమాను అద్భుతంగా మలిచినట్టు టాక్.