దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కొద్దిమంది నటీమణుల్లో పూజా హెగ్డే ఒకరు. వరుసగా తెలుగు, తమిళంతోపాటు బాలీవుడ్లోనూ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న ఈ భామ మంచి స్టార్డమ్ని ఎంజాయ్ చేస్తోంది. సినీ పరిశ్రమల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణుల్లో ఈ బ్యూటీ పేరు ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి ఈ నటి సొంతంగా ఓ గార్డెన్ని మెయిన్టెన్ చేస్తోంది.
ఆ గార్డెన్లో సేంద్రీయ పద్ధతిలో కూరగాయలు, పండ్లు పండిస్తోంది పూజా. తాజాగా ఆ గార్డెన్లో పండ్లు కోస్తున్న పిక్స్ని ఈ తార సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. అందులో.. ఈ బుట్టబొమ్మ ఓ బుట్ట పట్టుకుని చెర్రీ పండ్లని కోస్తోంది. పింక్ కలర్ పువ్వులు ఉన్న డ్రెస్తో ఉన్న ఈ భామ నవ్వుతూ కుర్రకారు హృదయాన్ని కొల్లగొడుతోంది. ఈ తార నవ్వు చూస్తుంటే ఆ పనిని ఎంత ఇష్టపడుతుందో తెలుస్తోంది. సాధారణ పనులను చేయడంలో ఉన్న ఆనందాన్ని ఈ బ్యూటీ ఎంజాయ్ చేస్తోంది. ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్నాయి. దీంతో ఎంతోమంది ఈ పూజా అభిమానులు ‘నిజమైన అందగత్తెవి నువ్వే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Pooja Hegde: ఇటీవల కొన్ని ఫ్లాపులను చవిచూసిన పూజా..
ఇటీవల కొన్ని ఫ్లాపులను చవిచూసిన పూజా ప్రస్తుతం సల్మాన్ ఖాన్తో కలిసి ‘కబీ ఈద్ కబీ దివాళి’ అనే బాలీవుడ్ సినిమా చేస్తోంది. ఈ మూవీలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అలాగే.. సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఓ మూవీలోనూ నటిస్తోంది. అలాగే.. పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం ‘జనగణమన’లో నటిస్తూ బిజీగా ఉంది.