ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు నియోజకవర్గం గజ్వేల్ నుంచి బుధవారం యూత్ కాంగ్రెస్ సభ్యులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ టీపీసీసీ ఇంచార్జి ఎం.ఆర్.జి. వినోద్ రెడ్డి మాట్లాడుతూ…. ఎమ్మెల్యేల అవినీతిపై చార్జిషీటు విడుదల చేస్తాం.. హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అన్నారు.
రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతి నిరుద్యోగ యువకుడికి రూ.1,60,000 బకాయి ఉందని, ద్రోహపూరిత కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటానికి విద్యార్థులు, యువత యువజన కాంగ్రెస్తో కలిసి నడుం బిగించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బి.వి. శ్రీనివాస్ పాల్గొన్నారు.