తాను ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయం తీసుకోవడంతో గజ్వేల్ నుంచి పోటీ చేసి చంద్రశేఖర్రావును ఓడిస్తానని గతంలో సవాల్ చేసిన ఈటల రాజేందర్తో ఎన్నికల పోరుకు పొంతన లేదన్నారు. అలాగే గజ్వేల్లో ఓటమి ఖాయమని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.
అరవింద్ విలేకరులతో మాట్లాడుతూ ‘‘రెండు చోట్ల నుంచి పోటీ చేయాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తనను గతంలో ఎన్నుకున్న గజ్వేల్ ప్రజలను అవమానించడమేనని, తన సొంత నియోజకవర్గ ప్రజలపై ఆయనకు విశ్వాసం లేదని తెలియజేస్తోందని అన్నారు.
కేసీఆర్ కామారెడ్డి దాకా వచ్చారు, ఇంకొన్ని అడుగులు వేసి ఉంటే నిజామాబాద్ వచ్చేస్తుండే కదా. అప్పుడు నాతో పోటీ పడాల్సి ఉంటుండే, అని బీజేపీ ఎంపీ ధర్మపురి అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను చూసిన తర్వాత నిజామాబాద్ జిల్లాలోని మొత్తం ఏడు నియోజకవర్గాల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందన్న నమ్మకం వ్యక్తం చేసారు ధర్మపురి అరవింద్.
- Read more Political News