ఆంధ్రప్రదేశ్లో ‘భారత చైతన్య యువజన పార్టీ’ (బీసీవై) పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు.
చిత్తూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త, జనసేన మాజీ నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ కొత్త రాజకీయ పార్టీ బీసీవైని స్థాపించారు. గుంటూరు శివారులోని నాగార్జున యూనివర్శిటీ ఎదుట ఆదివారం బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్, సూరజ్ మండల్, తదితర ప్రముఖ నేతల సమక్షంలో రామచంద్ర యాదవ్ కొత్త పార్టీ పేరును ప్రకటించిన భారీ బహిరంగ సభ జరిగింది.
రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే లక్ష్యంతో భారత చైతన్య యువజన పార్టీ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కొత్త రాజకీయ పాలన రావాలని అభిప్రాయపడ్డారు. వైఎస్సార్సీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాలన అంటే పురాణాల్లోని దెయ్యాలు గుర్తుకు వస్తాయని, వైఎస్సార్సీ పెద్దల నుంచి కార్యకర్తల వరకు అందరూ దోచుకుంటున్నారన్నారు.