ఎంపీ బండి సంజయ్కు ప్రమోషన్ లభించింది. జాతీయ స్థాయిలో కీలక పదవిని కట్టబెట్టారు. బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటిచించిన అధ్యక్షుడు జేపీ నడ్డా.. సంజయ్ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తెలంగాణ నుంచి డీకే అరుణను ఉపాధ్యక్షురాలిగా కొనసాగించారు. ఇక ఏపీ నుంచి సత్య కుమార్ను కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు నడ్డా ఉత్తర్వులు జారీ చేశారుఇటీవల బండి సంజయ్ను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి అధిష్టానం తొలగించింది.
దానికి కారణం బండి సంజయ్ అధ్యక్షతన రాష్ట్ర కేడర్ కొంత అసంతృప్తికి లోనైట్లు తెలిసింది.పార్టీలో ఒంటెద్దు పోకడలతో బండి సంజయ్ సీనియర్లను, కొత్తగా పార్టీలోకి వచ్చిన కలుపుకొని పోవటం లేదనే కారణంతో ఆయన్ను తప్పించినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఆయనకు కేంద్రమంత్రి పదవి కట్టబెట్టే ఛాన్స్ ఉందని ఊహాగానాలు వినిపించాయి. కానీ అనుహ్యంగా ఆయనకు జాతీయకార్యవర్గంలో చోటు కల్పించారు. అయినా కేడర్ సంతృప్తి చెందనట్లు తెలిసింది. ఇటీవల మోదీ వరంగల్ పర్యటన సందర్బంలో బండి సంజయ్ ప్రసంగించేటప్పుడు పార్టీ కార్యకర్తలు జోష్లో కనిపించారు.
ఆయన మాట్లాడుతున్నంత సేపు కార్యకర్తలు ఉత్సాహంగా ఈలలు, కేకలు వేశారు. వీటిని మోదీ నిషితంగా గమనించారు.ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న సమయంలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకనుంచైనా ఫిర్యాదులు చేయటం మానేసి పార్టీ కోసం పనిచేయాలన్నారు. కిషన్ రెడ్డినైనా.. ప్రశాంతంగా పనిచేసుకోనివ్వండని పలువురు నేతలను ఉద్దేశించి పరోక్షంగా చురకలు అంటించారు. దీంతో ఆయనలోనూ ఇంకా అసంతృప్తి ఉందని గమనించిన పార్టీ ఈ సమయంలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించాలని భావించినట్లు తెలుస్తోంది.