భద్రాద్రి జిల్లా బీజేపీకి ఊహించని షాక్..
మరి కొన్ని నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. గత మూడేళ్లుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న కోనేరు సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తండ్రి కోనేరు నాగేశ్వరరావు టీడీపీ పార్టీలో ఉంటూ బలమైన క్యాడర్ను సంపాదించుకున్నారు.
కోనేరు నాగేశ్వరరావు మరణానంతరం ఆయన రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న కోనేరు సత్యనారాయణ BJP పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. ప్రస్తుత రాజకీయాలకు అనుగుణంగా తన రాజకీయ భవిష్యత్తును మరింత ముందుకు తీసుకెళ్లేందుకే బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఎమ్మెల్సీ కీలక పాత్ర..
అధిష్ఠానం సన్నిహితుడైన ఎమ్మెల్సీ (జిల్లా నాయకుడు), కోనేరు సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీలో చేరడంలో ప్రధాన పాత్ర పోషించినట్లు సమాచారం. పార్టీలో చేరికపై ఆరు నెలల సుదీర్ఘ చర్చల అనంతరం ఎట్టకేలకు విజయం సాధించారు. భద్రాద్రి జిల్లాలో కమ్మ సామాజికవర్గ నేతలు లేకపోవడంతో అదే సామాజిక వర్గానికి చెందిన కోనేరు సత్యనారాయణను BRS పార్టీలోకి ఆహ్వానించడంతో జిల్లాలో BRS పార్టీ బలం మరింత పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉన్నా వివాదాలకు దూరంగా ఉన్న ఏకైక నాయకుడు కోనేరు సత్యనారాయణ అని చెప్పుకోవచ్చు.
- Read more Political News