ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవితను “ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చు. త్వరలోనే పట్టవచ్చు” అని భారతీయ జనతా పార్టీ పేర్కొంది.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లాం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మద్యం కుంభకోణంలో కవితకు పూర్తి సంబంధం ఉందని.. చర్యలు తీసుకుంటామన్నారు. అవినీతి పట్ల బీజేపీకి ‘జీరో టాలరెన్స్’ విధానం ఉందని, అది అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ, కేంద్రంలోనూ కనిపిస్తోందని, ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
కవితను త్వరలో అరెస్టు చేస్తామని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని అడిగిన ప్రశ్నకు ఇస్లాం “బహిరంగంగా సేకరించిన ప్రతి సమాచారం ఆధారంగా, ఆమె పూర్తిగా మద్యం కుంభకోణంలో పాలుపంచుకుంది. ఆమె అభివృద్ధి చేసిన నిర్మాణం, ఆమె ఎలా డబ్బు సంపాదించింది అనే సమాచారం ఆధారంగా, ఆమె కటకటాల వెనుకకు వెళ్లేది కాయమే.”
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తనకు వ్యతిరేకంగా ఏమీ లేదని చెప్పారని, ఇప్పుడు ఆయన ఆరు నెలలుగా జైలులో ఉన్నారని, కవిత విషయంలో కూడా దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుంటాయని ఆయన అన్నారు.
- Read more Political News