తెలంగాణలో నెలకు రూ.4,000 పింఛన్ ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని బీఆర్ఎస్ సోమవారం తీవ్రంగా విమర్శించింది. మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, జి.జగదీశ్రెడ్డితోపాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాహుల్గాంధీ ఈ పథకాన్ని అమలు చేయాలని అన్నారు.
“దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఈ హామీని అమలు చేస్తుందని ఆయన ప్రకటించనివ్వండి. అయన కేవలం స్థానిక పార్టీ నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారు అని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని వందల రూపాయలు సంక్షేమ పింఛన్లు ఇస్తున్నారని కూడా ఆయనకు తెలియదు. తెలంగాణ ఆయనను నమ్మే మూర్ఖులు కాదు’’ అని ప్రశాంత్ రెడ్డి అన్నారు.
ఆదివారం జరిగిన సభలో, కాంగ్రెస్ వాదనలు ఎలా ఉన్నా ఖమ్మంలో బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని అజయ్కుమార్ అన్నారు. బీఆర్ఎస్పై ప్రజలు రెండు సార్లు విశ్వాసం ఉంచారని, కేసీఆర్ మూడో విజయంతో హ్యాట్రిక్ సాధిస్తారని అన్నారు.