BRS యొక్క సోషల్ మీడియా విభాగం “100 Lies of the BJP” అనే పుస్తకాన్ని ప్రచురించింది
భారత రాష్ట్ర సమితి (BRS) భారతీయ జనతా పార్టీ (BJP) వైఫల్యాలు మరియు తెలంగాణ పట్ల సరి అయినా మద్దతు లేకపోవడం వంటి విషయాలను తెలుపుతూ బిఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం “బిజెపి యొక్క 100 అబద్ధాలు” అనే పేరుతో ఒక ప్రత్యేక బుక్లెట్ మరియు సిడిని ముందుకు తీసుకువొచ్చింది.
![BRS సోషల్ మీడియా విడుదల చేసిన '100 లైస్ ఆఫ్ BJP' పుస్తకం 2 సోషల్ మీడియా](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/KTR-3.png)
పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సోమవారం ప్రగతి భవన్లో సీడీ మరియు బుక్లెట్ను విడుదల చేశారు. తెలంగాణకు మరియు దేశానికి చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో బిజెపి ఎలా వైఫల్యం చెందిందో బట్టబయలు చేస్తూ బిఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం “బిజెపి యొక్క 100 అబద్ధాలు” సిరీస్ నడిపిస్తుంది. ఉద్యోగాల కల్పన, ద్రవ్యోల్బణం, జీఎస్టీ భారం, ప్రతి ఇంటికీ ఇంటర్నెట్, అందరికీ ఇళ్లు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం వంటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఆదిలాబాద్ సీసీఐ, వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్లతో సహా బీజేపీ వైఫల్యాలు మరియు వాగ్దానాలకు సంబంధించి బిఆర్ఎస్ సోషల్ మీడియా అండగొట్టనుంది
ఈ సోషల్ మీడియా ప్రచారం ద్వారా కేంద్రమే కాదు, తెలంగాణ బీజేపీ నేతలు కూడా భయపడుతున్నారని టీఎస్ఎండీసీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ట్వీట్ చేశారు. దీనిని ‘మంచి ప్రచారం’గా పేర్కొంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు క్రిశాంక్ మన్నె, దినేష్ చౌదరి, వై.సతీష్ రెడ్డి, పాటిమీడి జగన్మోహన్ రావుల కృషిని మంత్రి అభినందించారు.