జగన్ పాలనలో 3372 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయని టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఆరోపణలు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మహాశక్తి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి, మహాశక్తి వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు టీడీపీ అధినేత.
ఈ నేపథ్యంలో చంద్రబాబు మాట్లాడుతూ.. నాలుగేళ్లలో 52 వేల 587 దాడులు, అఘాయిత్యాలు జరిగాయన్నారు. మహిళలు 22 వేల 278 మంది అగుపించకుండా పోయారని అన్నరు. 3372 మందిపై అత్యాచారాలు జరిగాయని కూడా తెలిపారు. 41 మంది మహిళలపై సామూహిక అత్యాచారాల గురించి మండిపడ్డారు.
వలంటీర్లకు ప్రతి ఇంట్లో ఉన్న ఆడబిడ్డల సంబంధాల గురించి ఏం అవసరం అని …. చెప్పుతో కొట్టేవాడు లేక ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారని మండిపడ్డారు. కరెంట్ బిల్లులా? ఇంటి బాడుగా? తమకు నచ్చినట్టు కరెంట్ బిల్లులు పెంచేశారని నిప్పులు చెరిగారు చంద్రబాబు. ఇదే క్రమంలో ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోతుందని… ఎమ్మెల్యేలు గడప గడపకూ వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు.
టీడీపీ పాలనలో ఆడబిడ్డలను కన్నెత్తి చూడలేని పరిస్థితి ఉండేదని.. ప్రస్తుతం ఇంట్లో పడుకున్నా కంటి నిండా నిద్రపోలేని పరిస్థితి ఉందన్నారు. ఈ సందర్భంలో ఎవరు ఎక్కడ నుండి వచ్చి యాసిడ్ పోస్తారో తెలియని పరిస్థితి నెలకొందని .. .రేపల్లెలో జరిగిన దారుణం పట్ల కనీసం స్పందించలేదని, సీఎం ఎందుకు వెళ్ళలేదని మండిపడ్డారు.