టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. తాజాగా పార్వతీపురం జిల్లాలో పార్టీ బలోపేతం చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. నియోజకవర్గానికి సంబంధించి ఇంఛార్జ్ను మార్చేశారు. పార్వతీపురం నియోజకవర్గం నుంచే ప్రక్షాళన మొదలుపెట్టారు. నర్సిపురంకు చెందిన బోనెల విజయచంద్రను ఇంఛార్జ్గా నియమించారు.
ఈ క్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. మొన్నటి వరకు మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు ఇంఛార్జ్గా ఉన్నారు. చిరంజీవులు 2014 ఎన్నికల్లో పార్వతీపురం నుంచి విజయం సాధించారు. 2019లో జోగారావు చేతిలో ఓడిపోయారు. చిరంజీవుల్ని తప్పించి విజయచంద్రకు నియోజకవర్గ బాధ్యతల్ని అప్పగించారు. కొత్త ఇంఛార్జ విజయ చంద్ర తండ్రి ఆర్టీసీలో కండక్టర్గా పనిచేశారు. విజయచంద్ర కార్పొరేట్ సెక్టార్లో పనిచేసి ఆ తర్వాత వ్యాపారంలోమళ్లారు. చిన్నప్పటి నుంచి టీడీపీని అభిమానించారు .
పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఈ నెల 6న పార్వతీ పురం నియోజకవర్గ నాయకులతో పార్టీ పరిస్థితిపై చంద్రబాబునాయుడు మంగళగిరిలో మాట్లాడారు. గురువారం ఆయన స్థానంలో విజయచంద్రను ఇన్ఛార్జిగా నియమించారు.మరోవైపు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంపైనా సమీక్ష చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. దీనికి కారణాలను చంద్రబాబు వివరించారు.ఈ సమయంలో కొందరు నాయకులు చిరంజీవులు నాయకత్వాన్ని వ్యతిరేకించినట్లు సమాచారం నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని.. అలాగని అలసత్వం వహించవద్దన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని అధిష్ఠానం గుర్తిస్తుందన్నారు.