ఆంద్రప్రదేశ్ లో వాలంటీర్ల వ్యవస్థపై విమర్శలు, ప్రతివిమర్శలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు దీనిపై కీలక వ్యకాయలు చేసారు. వాలంటీర్లు పౌరసేవ కాకుండా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే బాగోదని స్పష్టం చేశారు. వ్యక్తిగత వివరాలని వాలంటీర్లు సేకరించడం ద్రోహమని, దీనివల్ల చాలా ప్రమాదం ఉందని చంద్రబాబు తెలిపారు .
ఈ రోజు మీడియాలో చంద్రబాబు పాల్గొన్నారు .. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజాసేవ వరకే వాలంటీర్ల సేవలు వినియోగించే విషయాన్ని పక్కాగా పరిశీలిస్తామని వెల్లడించారు . మరోక వైపు బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటుందంటూ కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు. ఎవరెవరో మాట్లాడిన వాటిపై స్పందించి చులకన అవ్వడం అనవసరం అని తేల్చి చెప్పారు.
దగాపడ్డ ఏపీ రాష్ట్ర ప్రజలకి మంచి చేయడమే ఇప్పుడు తనకు ముఖ్యమని బాబు అన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే తన ముఖ్య లక్ష్యమని చెప్పారు. ప్రజల ప్రయోజనం కోసం పెద్ద ఆలోచనలు అవసరం అని వాటి కోసం పోరాడితే కేంద్రం దిగొస్తుందనడానికి జల్లికట్టు ఘటనే ఒక మంచి ఉదాహరణ అని తెలిపారు. ఓట్ల అవకతవకలపై ఢిల్లీ వరకు వెళ్లి అయినా సరే పోరాటం చేస్తా అని కూడా స్పష్టం చేసారు .